MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అరవై ఏడు కిలోల బంగారు ఆభరణాలు, వెండి కుర్చీపై వినాయకుడు.. ఈ గణపతికి 450 కోట్ల రూపాయలకు బీమా

అరవై ఏడు కిలోల బంగారు ఆభరణాలు, వెండి కుర్చీపై వినాయకుడు.. ఈ గణపతికి 450 కోట్ల రూపాయలకు బీమా

గణేష్ ఉత్సవాలు భారతదేశంలో జోరుగా సాగుతున్నాయి. వినాయక మండపాలను నిర్మించి ప్రతి వీధిలోను గణేశుడిని పూజిస్తున్నారు. అయితే ఒకచోట మాత్రం ఏకంగా బంగారంతోనే గణేశుడిని అలంకరించారు. మన దేశంలో అతి ఖరీదైన గణపతి ఈయనే. 

2 Min read
Haritha Chappa
Published : Aug 28 2025, 11:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇండియాలో వినాయక చవితి
Image Credit : Instagram

ఇండియాలో వినాయక చవితి

వినాయక చవితి వచ్చిందంటే భారతదేశంలో వీధి వీధిన వినాయక మండపాలు కనిపిస్తాయి. మారుమూల పల్లెల్లో కూడా వినాయక చవితిని అంగరంగ వైభవంగా చేస్తారు. ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో గణేష్ ఉత్సవాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అక్కడ ప్రతి మూలలోనూ గణేష్ మండపాలు కనిపిస్తాయి. కాగా ముంబైలో ఇప్పుడు అతి ఖరీదైన గణేషుడిని ఏర్పాటు చేశారు. వెండి, బంగారంతో ఆ వినాయకుడిని అలంకరించారు. అందుకే ఆ గణేశుడికి ఏకంగా 450 కోట్ల రూపాయలకు పైగా బీమా చేయాల్సి వచ్చింది.

25
ముంబైలో ఎక్కడ?
Image Credit : Instagram

ముంబైలో ఎక్కడ?

ముంబైలోని మాతుంగ అనే ప్రాంతంలో కింగ్స్ సర్కిల్లో ఉన్న జిఎస్‌బి సేవా మండల్ ఈ ఖరీదైన గణపతిని ఏర్పాటు చేశారు. ఈ గణపతి విగ్రహాన్ని తయారు చేయించడానికి చాలా ఖర్చు పెట్టారు. దేశంలోనే అత్యంత ధనిక గణపతిగా ఇప్పుడు ఈ వినాయకుడు పేరు పొందాడు. ఈ వినాయకుడిని 67 కిలోల బంగారు ఆభరణాలతో అలంకరించారు. అలాగే గణపతి కూర్చున్న వెండి సింహాసనాన్ని 350 కిలోల వెండితో తయారు చేయించారు.

Related Articles

Related image1
వినాయక చవితికి బేబీ బంప్‌తో మెగా కోడలు లావణ్య త్రిపాఠి, దిష్టి తగిలేంత అందంగా
35
అందరికీ ప్రమాద బీమా
Image Credit : Instagram

అందరికీ ప్రమాద బీమా

ఈ వినాయకుడికి చేసిన బీమాలో బంగారం, వెండి ఆభరణాలతో పాటు ఆ మండపాన్ని ఏర్పాటు చేసిన వాలంటీర్లు, పూజారులు, వంట వారు, గార్డులు అందరికీ ప్రమాద బీమాను చేయించారు. ఏదైనా విపత్తు కలిగితే నష్టాన్ని భరించే విధంగా బీమాలు ఉన్నాయి. ఈ బీమాను ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ చేసింది.

45
ప్రత్యేక మట్టితో తయారీ
Image Credit : Pixabay

ప్రత్యేక మట్టితో తయారీ

ఈ గణేశా మండపంలోని వినాయకుడిని షాడు అనే మట్టితో తయారు చేయించారు. ఈ మట్టి ఎంతో ప్రత్యేకమైనది. పర్యావరణ అనుకూలమైనది. అలాగే ఈ వినాయకుడిని తయారు చేయడానికి సహజమైన రంగులను మాత్రమే వినియోగిస్తారు. ఈ వినాయకుడిని చూసేందుకు రెండు కళ్ళు చాలవు. బంగారంతో ధగధగలాడుతూ కనులకింపుగా కనిపిస్తారు.

55
కొబ్బరికాయల ప్రసాదం
Image Credit : Pixabay

కొబ్బరికాయల ప్రసాదం

ముంబైలోని మాతుంగా గణపతి ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ గణపతిని చూసేందుకు దూర తీరాల నుంచి ఎంతోమంది వస్తూ ఉంటారు. ఈ గణపతి విగ్రహాన్ని ఒక్కసారి దర్శిస్తేనే కోరిన కోర్కెలను నెరవేరుతాయి అని నమ్ముతారు. ఇక్కడ పది రోజులు పాటు గణేష్ ఉత్సవాన్ని అందరి వైభవంగా జరుపుతారు. ఇక్కడ ప్రతిరోజు ఉదయం భక్తులకు ఇచ్చే కొబ్బరికాయ ప్రసాదం కోసం వందల మంది భక్తులు క్యూ లైన్ లలో నిల్చుంటారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినాయక చవితి
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved