- Home
- Entertainment
- ఫ్రెష్ అందాలను వేడి వేడిగా వడ్డిస్తూ ఘాటెక్కిస్తున్న రామ్చరణ్ భామ.. ట్రెండీ వేర్లో మైండ్ బ్లాక్ లుక్
ఫ్రెష్ అందాలను వేడి వేడిగా వడ్డిస్తూ ఘాటెక్కిస్తున్న రామ్చరణ్ భామ.. ట్రెండీ వేర్లో మైండ్ బ్లాక్ లుక్
కియారా అద్వారా మరోసారి తెలుగులో సందడి చేసేందుకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఆమె `ఆర్సీ15`లో హీరోయిన్గా నటిస్తుంది. అదే సమయంలో తన ఫ్రెష్ అందాలను వేడి వేడి తెలుగు ఆడియెన్స్ కి అందిస్తోంది కియారా అద్వానీ.

కియారా ఇటీవల స్టయిలీష్లో కనువిందు చేసింది. రామ్చరణ్-శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్ర ఓపెనింగ్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా నిలిచింది. అందరి చూపులు తనవైపు తిప్పుకుంది.
ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. వర్కౌట్ తరహా డ్రెస్లో పోజులిచ్చింది. లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది కియారా అద్వానీ.
గ్రీన్ డ్రెస్లో, ట్రెండీ వేర్లో కియారా పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెట్టింటి కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది. ఇందులో కియారా చూపులు నెటిజన్ల గుండెల్ని తొలిచేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.
`ఎంఎస్ధోని` చిత్రంతో పాపులర్ అయిన కియారా తెలుగులో మహేష్తో `భరత్ అనే నేను` చిత్రంలో నటించింది. ఈ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. మహేష్కి లవర్గా ఆమె నటన, అందచందాలు ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేశాయి.
మరోవైపు రామ్చరణ్తో `వినయ విధేయ రామ`లో మెరిసింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. కానీ చెర్రీ, కియారా జోడికి మంచి మార్కులే పడ్డాయి.
మళ్లీ వీరిద్దరు జోడి కడుతున్నారు. ఈ సారి పాన్ ఇండియా సినిమా కోసం కలిసి నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ 15వ చిత్రం భారీ బడ్జెట్తో రూపొందుతుంది. దిల్రాజు నిర్మిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా ఓపెనింగ్ హైదరాబాద్లో గ్రాండ్గా జరిగిన విషయం తెలిసిందే. చిరంజీవి, బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్, రాజమౌళి గెస్టు లుగా హాజరై ఓపెనింగ్ ఈవెంట్ని మరింత గ్రాండ్గా మార్చారు.
ఇటీవల ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన `షేర్షా` చిత్రంతో విజయాన్ని అందుకుంది కియారా అద్వానీ. రియల్ లైఫ్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఓటీటీలో విడుదలై సక్సెస్ టాక్ని తెచ్చుకుంది.
మరోవైపు ఇప్పుడు కియారా `భూల్ భులైయ్యా 2`, అలాగే `జగ్ జుగ్ జీయో`, `మిస్టర్ లేలే` చిత్రాల్లో నటిస్తుంది. ప్రస్తుతం ఇవి శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఇక రామ్చరణ్ చిత్రం తెలుగు, తమిళం, హిందీలో పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న విషయం తెలిసిందే.