కరణ్ ఏడుస్తూనే ఉన్నాడు.. సుశాంత్ మరణం తరువాత విమర్శలు
సుశాంత్ ఆత్మహత్య తరువాత వచ్చిన విమర్శలపై కరణ్ జోహార్ సన్నిహితుడు స్పందించాడు. తనపై వస్తున్న ఆరోపణలతో కరణ్ జోహార్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడని వెల్లడించారు. బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరణ్ స్నేహితుడు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య బాలీవుడ్ లో ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఇండస్ట్రీలోని నెపోటిజం (వారసత్వం) కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని. ఇండస్ట్రీ పెద్దలు కొందరు మాఫియాగా మారి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చేవారిని వేదిస్తున్నారిన ఆరోపణలు వినిపించాయి.
ముఖ్యం గా కరణ్ జోహార్, సల్మాణ్ ఖాన్, మహేష్ భట్ లాంటి వారి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపించాయి. అయితే తాజాగా ఈ విషయంలో కరణ్ జోహార్ సన్నిహితుడు స్పందించాడు. తనపై వస్తున్న ఆరోపణలతో కరణ్ జోహార్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడని వెల్లడించారు. బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరణ్ స్నేహితుడు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. `కరణ్ తీవ్ర వేదనకు గురయ్యాడు. సుశాంత్తో ఏ సంబంధం లేని అనన్య పాండేకు కూడా విమర్శలు తప్పలేదు. సుశాంత్ ఆత్మహత్య తరువాత సోషల్ మీడియాలో కరణ్ను కూడా ఆత్మహత్య చేసుకోమంటూ చాలా మంది దారుణమైన కామెంట్స్ చేశారు` అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
అయితే ఈ విమర్శలపై కరణ్ ఎందుకు మౌనంగా ఉన్నాడో కూడా వెల్లడించాడు. ప్రస్తుతం ప్రజల్లో ఆవేశం కారణంగా తాను ఏది మాట్లాడినా మరిన్ని విమర్శలకు కారణమవుతుందని, అందుకే లాయర్ సలహా మేరకు కరణ్ మౌనంగా ఉన్నట్టుగా తెలిపాడు. ప్రస్తుతం కరణ్ పరిస్థితి మాట్లాడేట్టు లేదని, మానసికంగా కుంగిపోతూ ఏడుస్తూనే ఉన్నాడని వెల్లడించాడు.
బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ గత నెల 14న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకొని మరణించాడు. అయితే వరుసగా అవకాశాలు చేజారటంతోనే ఒత్తిడి గురైన సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న ఆరోపణలు వినిపించాయి. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతోంది.