అవి నిరూపించలేకపోతే.. పద్మశ్రీ వెనక్కి ఇస్తా: కంగనా రనౌత్
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య తరువాత సంచలన ఆరోపణలు చేసిన కంగనా, ఒక వేళ ఆ ఆరోపణలు నేను నిరూపించలేకపోతే భారత ప్రభుత్వం నాకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును తిరిగిచ్చేస్తానంటూ సంచలన ప్రకటన చేసింది.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను ప్రూవ్ చేయలేకపోతే తనకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డ్ను వెనక్కి ఇచ్చేస్తానని కామెంట్ చేసింది కంగనా. జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న తరువాత కంగనా తన సోషల్ మీడియా పేజ్లో వీడియోలను రిలీజ్ చేసింది.
ఆ వీడియోల్లో ఇండస్ట్రీలోని నెపోటిజం కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించింది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ, మీడియా నుంచి వస్తున్న వ్యతిరేకత కారణంగా చాలా మంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని చెప్పింది. ఈ సందర్భంగా మీడియా మీద కూడా విరుచుకుపడింది కంగనా.
కొంత మంది జర్నలిస్ట్లు పేర్లు ప్రస్తావించకుండా కొన్ని బ్లైండ్ వార్తలు రాస్తున్నారని ఆరోపించింది. అదే సమయంలో సుశాంత్ది ఆత్మ హత్య కాదని, ప్లాన్డ్ మర్డర్ అన్న అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే ఇన్ని ఆరోపణలు చేసిన కంగనా ఒక వేళ ఆ ఆరోపణలు నేను నిరూపించలేకపోతే భారత ప్రభుత్వం నాకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును తిరిగిచ్చేస్తానంటూ సంచలన ప్రకటన చేసింది.
ఈ సందర్భంగా కంగనా మాట్టాడుతూ.. `ముంబై పోలీసులు నన్ను విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు ఇచ్చారు. కానీ ఆ సమయంలో నేను మనాలీలో ఉండటంతో అక్కడికి రావాలని వారిని కోరాను. నేను సమాధానం ఇచ్చిన తరువాత నాకు ఎలాంటి రిప్లై రాలేదు.
నేను మీకు ఓ విషయం చెప్తున్నా.. నేను చెప్పిన విషయాల్లో ఏదైనా అబద్దం ఉన్నా... చెప్పిన విషయాలు ప్రూవ్ చేయలేకపోయినా, ప్రజలకు తెలిసిన విషయం కాకపోయినా.. నేను నా పద్మశ్రీ అవార్డను తిరిగిచ్చేస్తా`నని చెప్పింది.