కాజోల్, శిల్పాశెట్టి, కిరణ్రావు పిల్లలు మిస్ క్యారేజ్ హీరోయిన్లు..షాకిచ్చే విషయాలు బహిర్గతం!
మాతృత్వం అనేది మహిళకి గొప్ప వరం. అదొక గొప్ప అనుభూతి. మాతృత్వం మించిన ఆనందం ఓ మహిళకి మరోటి లేదు. కానీ మన హీరోయిన్లు ఓ సందర్భంలో మాతృత్వాన్ని కోల్పోయారు. మిస్ క్యారేజ్తో ఇబ్బంది పడ్డారు. కాజోల్, శిల్పాశెట్టి, కిరణ్ రావు, సైరా బాను వంటి తారల జీవితంలో చేతు జ్ఞాపకంలా మిగిలిన ఆ విషయాలేంటో ఓ సారి చూద్దాం.
`సాగర కన్య`గా తెలుగు ఆడియెన్స్ ని అలరించి, తన స్లిమ్ అందంతో మంత్రముగ్దుల్ని చేసిన శిల్పా శెట్టి ముంబయికి చెందిన వ్యాపారవేత్త రాజ్కుంద్రాని 2009లో వివాహం చేసుకుంది. అయితే తన మొదటి కుమారుడు వియాన్ జన్మించడానికి ముందు ఓ బేబీని కోల్పోయింది శిల్పా. తాను మొదట అబార్షన్ చేయించుకుంది.
బాలీవుడ్ స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ అజయ్ దేవగన్, కాజోల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన రెండేళ్లకే ఆమెకి మిస్ క్యారీ అయ్యింది. `కభీ ఖుషీ కభీ గమ్` సినిమా టైమ్లో కాజోల్ ఆసుపత్రి పాలయ్యింది. ఆ సమయంలోనే ఇది జరిగిందట. దీంతో కాజోల్ చాలా బాధపడింది.
బాలీవుడ్ బాద్షా షారూఖ్ భార్య గౌరీ ఖాన్ కూడా మిస్ క్యారేజ్తో బాధపడ్డారు. ఆమె 1997లో తన కుమారుడు అర్యాన్ జన్మించిన తర్వాత అబార్షన్ చేయించుకుందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో షారూఖ్ ఖాన్ చెప్పారు.
బాలీవుడ్ సీనియర్ నటుడు దిలిప్ కుమార్ వైఫ్ సైరా బాను సైతం 1972లో మిస్ క్యారీ ఇబ్బందిని ఫేస్ చేశారు. ఎనిమిది నెలల ప్రెగ్నెంట్ టైమ్లో ఆమెకి మిస్ క్యారీ అయ్యింది. ఆ తర్వాత ఆమె పిల్లలను కనలేదు. ఇప్పటి వరకు అసలు పిల్లలే లేరు.
మరో నటి రష్మీ దేశాయ్.. 2012లో నందిష్ సంధుని వివాహం చేసుకుంది. కొన్ని నెలల్లోనే వీరికి ప్రెగ్నెంట్ అందింది. కానీ మిస్ క్యారేజ్ వల్ల ఆమె చైల్డ్ ని కోల్పోయింది. అది తమ జీవితంలో ఎంత బాధని మిగిల్చిందని నందిష్ సంధు తెలిపారు.
మరో నటి అంకిత భరవా కరణ్ పటేల్ని వివాహం చేసుకుంది. 2018లో ఆమె ప్రెగ్నెంట్ అయ్యారు. ఐదో నెల సమయంలో అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమె కూతురికి జన్మనిచ్చింది.
అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు కూడా మిస్ క్యారీతో బాధపడింది. 2009లో ఆమె బేబీని కోల్పోయింది. ఆ తర్వాత రెండేళ్లకు సరోగసీ ద్వారా బేబీకి జన్మనిచ్చింది కిరణ్ రావు.