జబర్దస్త్ జర్నీని గుర్తు చేసుకుని ఎమోషనలైన ఇంద్రజ, కమెడీయన్లు.. బండ్ల గణేష్ని మించిపోయారుగా!
`జబర్దస్త్` జర్నీని గుర్తు చేసుకుంటూ కమెడీయన్లు ఎమోషనల్ అయ్యారు. తమ జీవితం షోకే అంకితమన్నారు. తనకు ఇంత ఫాలోయింగ్ ఉందన్న విషయం ఈ షో ద్వారానే తెలిసిందని నటి ఇంద్రజ భావోద్వేగానికి లోనయ్యారు.
`జబర్దస్త్` షో 2013 నుంచి రన్ అవుతున్న విషయం తెలిసిందే. మొదట్లో కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా, ఆ తర్వాత చాలా మంది దీనికి అలవాటు పడ్డారు. ఇంటిళ్లిపాది చూసే షోగా, కాస్త రిలాక్స్ అయ్యే షోగా దీన్ని చూస్తున్నారు. కొన్ని కోట్ల మంది ఈ షోని చూస్తున్నారు.
ఆడియెన్స్ కి వినోదాన్ని పంచడమే కాదు, పదుల సంఖ్యలో ఆర్టిస్టులకు జీవితాన్నిచ్చింది. వారి లైఫ్నే మార్చేసింది. ఇందులో రాణించిన చాలా మంది సినిమా అవకాశాలు దక్కించుకుంటున్నారు. కొందరు హీరోలుగానూ రాణిస్తున్నారు. అంతగా మెప్పుపొందుతుందీ షో.
తాజాగా `జబర్దస్త్` కమెడీయన్లు మరోసారి ఈ షోని, ఈ జర్నీని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. కమెడీయన్ రాకెట్ నెక్ట్స్ ఎపిసోడ్లో జబర్దస్త్ పైనే ఓ స్కిట్ చేశాడు. అయితే నిర్మాత బండ్ల గణేష్ని వాడుకున్నారు. పవన్ సినిమా ఈవెంట్లలో బండ్ల గణేష్ ఎలా అయితే నాన్ స్టాప్ గా రెచ్చిపోతాడో, ఇందులో రాకేష్ కూడా ఆయన్ని ఇమిటేట్ చేస్తూ జబర్దస్త్ పై పంచుల వర్షం కురిపించారు.
జబర్దస్త్ కమెడీయన్లు తోపు అని చెప్పాడు. 2013 ఫిబ్రవరి ఒక అద్భుతం జరిగింది. పుట్టేటప్పుడు ఎవరూ గుర్తించరు, అద్భుతం జరిగాక ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. ఆ అద్భుతమే `జబర్దస్త్` అని చెప్పాడు.
సుడిగాలి సుధీర్ని టార్గెట్ చేస్తూ, `దాగుడు మూతల్లో దొరికిపోతున్నా నాన్న..దాగుడు మూతలు కూడా ఆడటం రాదంటున్నారు నాన్న` అని తన కొడుకు అన్నాడని, అందుకు ఆయన చెబుతూ, సుధీర్ ఫోటో చూపించి కొన్ని సంవత్సరాలుగా దాగుడు మూతలు ఆడుతున్నాడు. ఏ రాత్రి ఎవరికీ దొరకలేదురా, ఆయన్ని చూడురా అన్నా`నని చెప్పాడు. దీంతో ఇది నవ్వులు కురిపించింది. జబర్దస్త్ ఒక యాగమని తెలిపాడు.
దీనిపై జడ్జ్ గా ఉన్న మనో స్పందిస్తూ, కొన్ని కోట్ల మంది ఈ షో వల్ల రిలాక్స్ అవుతున్నారనేది పచ్చి నిజమన్నారు. దీంతో కమెడీయన్లు చప్పట్లతో మారుమ్రోగించారు.
హైపర్ ఆది స్పందిస్తూ, `జబర్దస్త్` గురించి రాకేష్ చెప్పింది ప్రతి ఒక్కటి నిజమని, ఈ షో లేకపోతే ఇక్కడ ఉన్నవాళ్లు ఎవరూ లేరని అందరిని ఆలోచింప చేశాడు ఆది.
దీనిపై సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ, `ఈ రోజు మేమే కాకుండా మా ఫ్యామిలీస్ అందరు హ్యాపీగా ఉండటానికి కారణం `జబర్దస్త్` షో అని ఎమోషనల్ అయ్యారు.
గెటప్ శ్రీను స్పందిస్తూ, ఎక్కడో ప్లాట్ఫామ్లో ఉండేవాళ్లం. ఈ స్థాయికి తీసుకొచ్చింది జబర్దస్త్ అని, ఈ షోకి ఎప్పటికీ రుణపడే ఉంటామని ప్రకటించాడు. `జబర్దస్త్` లైఫ్ ఇచ్చిందని, ఈ లైఫ్ జబర్దస్త్ కే అంకితమని భాస్కర్ చెప్పారు.
ఇక జడ్జ్ గా ఉన్న ఇంద్రజ స్పందిస్తూ, `నేను ఇండస్ట్రీకి వచ్చి 27వ ఏళ్లు అవుతుంది. కానీ నన్ను అభిమానించే వాళ్లు, ప్రేమించే వాళ్లు ఇంత మంది ఉన్నారా? నాకు తెలియజేసిన షో `జబర్దస్త్`. ఇది పచ్చి నిజం. ఇందులో భాగం అయినందుకుందు ఎంతో సంతోషిస్తున్నా` అని ఎమోషనల్కి గురి చేసింది ఇంద్రజ.
దీంతో షోలోని అందరు, కమెడీయన్లు, యాంకర్ రష్మీతో సహా అంతా లేని చప్పట్లతో మారుమ్రోగించారు. శిరస్సు వంచి దెండం పెట్టారు. ప్రస్తుతం ఈ లేటెస్ట్ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ ఎపిసోడ్ వచ్చే శుక్రవారం ప్రసారం కానుంది.