Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • టాలీవుడ్ చరిత్రలో ఎప్పుడైనా ఇది చూశారా.. అన్నదమ్ముల మధ్య అరుదైన సంఘటన, 20 రోజుల గ్యాప్ లో

టాలీవుడ్ చరిత్రలో ఎప్పుడైనా ఇది చూశారా.. అన్నదమ్ముల మధ్య అరుదైన సంఘటన, 20 రోజుల గ్యాప్ లో

టాలీవుడ్ సినీ చరిత్రలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. కొన్ని అరుదైన సంఘటనలు కూడా ఉన్నాయి. ఒకే ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు రావడం అనేది టాలీవుడ్ లో మాత్రమే కాదు ఇతర చిత్ర పరిశ్రమలో కూడా ఉంది.

tirumala AN | Published : Jan 31 2025, 11:19 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

టాలీవుడ్ సినీ చరిత్రలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. కొన్ని అరుదైన సంఘటనలు కూడా ఉన్నాయి. ఒకే ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు రావడం అనేది టాలీవుడ్ లో మాత్రమే కాదు ఇతర చిత్ర పరిశ్రమలో కూడా ఉంది. అయితే టాలీవుడ్ చరిత్రలో ఎప్పుడూ జరగని అరుదైన సంఘటన ఒక ఫ్యామిలిలో చోటు చేసుకుంది. అది కూడా అన్నదమ్ముల మధ్య. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 

 

25
Asianet Image

నందమూరి ఫ్యామిలిలో ప్రస్తుతం బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రధానంగా హీరోలుగా రాణిస్తున్నారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అన్నదమ్ములు అనే సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ ఒకే తరహా కథతో వేర్వేరు చిత్రాల్లో నటించారు. విశేషం ఏంటంటే ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి. ఆ చిత్రాలు రెండూ ఒకే ఏడాది కేవలం 20 రోజుల గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. ఆ చిత్రాలు ఎన్టీఆర్ నటించిన టెంపర్, కళ్యాణ్ రామ్ నటించిన పటాస్. 

 

35
Asianet Image

పటాస్ చిత్రం జనవరి 23, 2015న రిలీజ్ అయింది. టెంపర్ చిత్రం ఫిబ్రవరి 13న రిలీజ్ అయింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో వరుస పరాజయాలకు బ్రేక్ వేసిన చిత్రం పటాస్.. ఎన్టీఆర్ కి కూడా ఆ టైం లో హిట్ చాలా అవసరం. టెంపర్ సూపర్ హిట్ అయింది. పటాస్ చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కింది. టెంపర్ చిత్రాన్ని పూరి జగన్నాధ్ తెరకెక్కించారు. ఈ రెండు చిత్రాల కథలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. 

 

45
Asianet Image

బ్యాడ్ పోలీస్ అధికారి మంచిగా మారడం అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాలని తెరకెక్కించారు. కథలు ఒకే విధంగా ఉండడంపై గతంలో అనిల్ రావిపూడి స్పందించారు. టెంపర్ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు. మేమిద్దరం ఎప్పుడూ కలుసుకోలేదు..కథల గురించి మాట్లాడుకోలేదు. బహుశా ఇద్దరం ఒకే జోన్ లో కథని ఆలోచించాం ఏమో అని అనిల్ రావిపూడి అన్నారు.  కథ ఒకటే అయినప్పటికీ పూరి జగన్నాధ్ గారు తన స్టైల్ లో రెబల్ యాటిట్యూడ్ తో టెంపర్ చిత్రాన్ని చేశారు. 

 

55
Asianet Image

పటాస్ చిత్రాన్ని  నేను నా స్టైల్ లో ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించాను అని తెలిపారు. ఏ ఇద్దరు దర్శకులు ఒకే కథని ఒకేలా తెరకెక్కించలేరు అని అనిల్ రావిపూడి తెలిపారు. పటాస్, టెంపర్ చిత్రాలు ఒకే కథతో తెరకెక్కడం.. అన్నదమ్ములు హీరోలుగా నటించడం.. 20 రోజుల గ్యాప్ లో రిలీజ్ కావడం అనేది విచిత్రం మాత్రమే కాదు, అరుదైన విషయం కూడా. 

 

tirumala AN
About the Author
tirumala AN
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది. Read More...
 
Recommended Stories
Top Stories