MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki kalaganaledu: జ్ఞానంబ నిర్ణయం విని ఆనందంతో కుటుంబ సభ్యులు.. కళ్ళు తిరిగి పడిపోయిన జెస్సి!

Janaki kalaganaledu: జ్ఞానంబ నిర్ణయం విని ఆనందంతో కుటుంబ సభ్యులు.. కళ్ళు తిరిగి పడిపోయిన జెస్సి!

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు అక్టోబర్ 26వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

3 Min read
Navya G
Published : Oct 26 2022, 01:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..అఖిల్ రామతో, ఇన్ని రోజులు నేను తెలియక తప్పు చేశాను అన్నయ్య అని అంటాడు. దానికి రామా, ఇప్పుడు మనం ఎన్ని అనుకున్నా లాభం లేదు అఖిల్. రేపు ఉదయం అమ్మ నిర్ణయం చెప్తుంది అని అంటాడు. ఆ తర్వాత సీన్లో జ్ఞానాంబ, జానకి చెప్పిన విషయాలన్నీ గుర్తుతెచ్చుకుంటూ ఆలోచనలో పడి చికితతో చెప్పి కుటుంబం అందరినీ పిలవమని చెప్తుంది. అదే సమయంలో చికిత, మల్లికా విష్ణు గదిలోకి వెళ్లి అమ్మగారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని అంటుంది.
 

28

 అప్పుడు మల్లిక,  చికిత వెళ్ళిపోయిన తర్వాత విష్ణు తో, ఇప్పుడు అత్తయ్య గారు మనల్ని రమ్మంటున్నారు అక్కడ ఏం జరిగినా మీ నిర్ణయం మాత్రం మార్చుకోవద్దు అని చెప్పి అంటుంది మల్లిక. మరోవైపు జానకి రామల తో పాటు మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి వస్తారు. అప్పుడు జ్ఞానాంబ మాట్లాడుతూ, మీరందరూ ఇంటి నుంచి వెళ్దామని నిర్ణయం తీసుకున్నారు ఒక విషయం గుర్తుంచుకోండి. మీ గురించి రాబోయే భవిష్యత్తు గురించి నేను చాలా ఆలోచించను. కడుపుతో ఉన్న ఇద్దరు కోడలని దృష్టిలో పెట్టుకున్నాను.
 

38

 వాళ్ళని పిల్లల భవిష్యత్తు గురించి దృష్టిలో పెట్టుకుంటూ నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను అని అంటుంది. అప్పుడు జానకి మనసులో, ఇప్పుడు అత్తయ్య గారు ఇంట్లో అందరూ కలిసి ఉండమన్నట్టు నిర్ణయం తీసుకుంటే మంచిది అని అనుకుంటుంది. అప్పుడు మల్లిక, పోలేరమ్మ మనసు మారదు కదా అని అనుకుంటుంది. అప్పుడు జ్ఞానాంబ, జానకి మూడు నెలలు గడివిచ్చింది అందరి మనసులు మార్చటానికి కూడా దృష్టిలో పెట్టుకుంటూ ఈ మూడు నెలల వరకు అందర్నీ ఒక కుటుంబంలో కలిసి ఉండమని నిర్ణయించుకున్నాను. 
 

48

కానీ మూడు నెలల తర్వాత ఎవరు మనసులు మారిపోయిన సరే కుటుంబం నాలుగు ముక్కలు అవుతుంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జ్ఞానాంబ. ఆ మాటలు విన్న జానకి రామా ఎంతో ఆనందపడతారు. మల్లిక మొఖం మాడిపోతుంది. ఇలాగ అయిందేంటి! అయినా ఈవిడ ఒక మాట మీద ఎప్పుడూ నిలబడదు అనుకుంటుంది. మాడిపోయిన మల్లిక ముఖం చూసిన గోవిందరాజు దీని పని చెప్తాను అని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్లో మల్లికా ఇంటి పెరట్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది.
 

58

 చికిత అటువైపు వెళుతూ, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అని పాట పాడుతూ ఉంటుంది. నన్ను చూసి ఎందుకు ఆ పాట పాడుతున్నావు అని మల్లిక కోపంగా అడగగా మిమ్మల్ని చూసి ఎక్కడ పడుతున్నానమ్మ గారు. నేనేదో ఇందాక పాట గుర్తొచ్చి పాడుతూ వెళ్తుంటే మీరు దారిలో తగిలారు అని అంటుంది. ఇంతలో వెన్నెల అక్కడికి వచ్చి నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది అని పాట పాడుతూ అటువైపు నుంచి వెళ్ళిపోతుంది. వీళ్ళందరూ కావాలని ఇలా చేస్తున్నారు అని మల్లిక అనుకుంటుంది.
 

68

 అప్పుడు గోవిందరాజ అక్కడికి వచ్చి గంతులు వేస్తూ మల్లిక చుట్టూ తిరుగుతూ మల్లికని ఎక్కిరిస్తూ పాటలు పాడుతూ ఉంటాడు. ఏమమ్మా అలాగున్నావు ఓహో విడగొట్టడానికి అగ్గిపుల్ల గీసి ఇంటి మీద వెలిగించినా ఇల్లు కాలలేదని బాధపడుతున్నావా అమ్మ అని ఎక్కిరించి వెళ్లిపోతాడు. ఆ తర్వాత సీన్లో జానకిని రామ ఎత్తుకుంటూ తన గదిలో తిప్పుతూ చాలా ఆనందంగా ఉన్నది అని బుగ్గ మీద ముద్దు పెడతాడు. ఆ తర్వాత ఇద్దరూ కొంచెం సేపు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు.
 

78

 ఇంతలో జెస్సి కళ్ళు తిరిగి పడిపోయింది అని చికిత వచ్చి చెప్తుంది. అందరూ అక్కడికి వెళ్లి కంగారుగా చూసేసరికి అఖిల్ జెస్సిని ఎత్తుకొని మంచం మీద పడుకోబెడతాడు. అప్పుడు జానకి వచ్చి డాక్టర్ కి ఫోన్ చేసి రమ్మంటుంది. అప్పుడు మొఖం మీద నీళ్లు కొట్టేసరికి జెస్సి లెగుస్తుంది. జ్ఞానాంబ చాలా ఆందోళన పడుతుంది. ఎలా ఉంది జెస్సీ అని జానకి అడగగా, కొంచెం నీరసంగా ఉన్నది అక్క అని జెస్సి అంటుంది. అప్పుడు జానకి కంగారు పడొద్దు డాక్టర్లు వస్తున్నారు అని అంటుంది. ఇప్పుడు డాక్టర్లు వస్తే నా ప్రేగ్నెన్సీ బయట పడిపోతుంది ఏమో అని భయపడుతున్న మల్లికా అక్కడి నుంచి తప్పించుకోవడానికి చూస్తుంది. 
 

88

ఇంతలో జ్ఞానాంబ మల్లిక ని పిలిచి,  వెళ్లి జెస్సి కోసం గ్లూకోస్ చేయమని చెప్తుంది. అక్కడ గ్లూకోజ్ నీళ్లు తయారు చేసిన మల్లిక చికితని పిలిచి జెస్సికి ఇప్పిస్తుంది. వంటగది నుంచి వెనక్కి పారిపోదాం అనుకున్న మల్లికని గోవిందరాజు ఆపి డాక్టర్ వస్తే డబ్బులు ఇవ్వాలి కదా నా పర్స్ లో డబ్బులు తీసి టేబుల్ మీద పెట్టమ్మా అని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!
 

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
హీరో నువ్వా నేనా, బాలయ్య ముఖం మీదే అడిగేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్.. సినిమా దొబ్బింది అని అప్పుడే అర్థమైంది
Recommended image2
ఆ స్టార్ హీరోయిన్ వల్ల పరువు పోయింది.. ఓపెన్‌గా చెప్పేసిన నటుడు రవిబాబు
Recommended image3
అప్పుడు మహేష్ బాబు పక్కకు పిలిచి మరీ తిట్టాడు.. సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved