ఫాదర్స్ డే స్పెషల్ః జబర్దస్త్ కమెడీయన్స్ కెవ్వుకార్తీక్, ఇమ్మాన్యుయెల్, నూకరాజు కన్నీటి గాథలు
`జబర్దస్త్` కమెడీయన్లు ఇమ్మాన్యుయెల్, కెవ్వు కార్తీక్, నూకరాజు హాస్యంతో నవ్వించడమేకాదు, ఇప్పుడు తన రియల్ గాథలు చెప్పి ఏడిపించారు. `ఫాదర్స్ డే` సందర్భంగా వాళ్ల ఫాదర్స్ కన్నీటి గాథలు పంచుకుని కన్నీళ్లు పెట్టించారు.
`జబర్దస్త్` అంటే కామెడీ. అద్భుతమైన పంచ్లతో ఆడియెన్స్ కి నవ్వులు పూయిస్తుంది. ఇంటిళ్లిపాదిని నవ్వుల్లో ముంచెత్తుతూ రిలీఫ్ నిస్తుంది. ఈ కామెడీ పంచేందుకు హాస్యనటులు నిరంతరం శ్రమిస్తుంటారు. ప్రతి వారం కొత్త స్కిట్లతో ఆడియెన్న్ ముందుకొస్తూ నవ్వులు పంచుతుంటారు.
తాజాగా ఈ వారం సండే స్పెషల్గా కన్నీటి గాథలు పంచుతున్నారు. `ఫాదర్స్ డే`(జూన్ 20) సందర్బంగా తమ తండ్రులతో ఉన్న అనుబంధాన్ని, తమని పెంచేందుకు తండ్రులు పడే కష్టాలను పంచుకున్నారు. అందరిచేత కన్నీళ్లు పెట్టిస్తున్నారు.
ఇమ్మాన్యుయెల్, కెవ్వు కార్తీక్, నూకరాజు, భాస్కర్, హైపర్ ఆది ఇలా అందరు తమ తండ్రులతో కలిసి స్కిట్ చేశారు. కడుపుబ్బా నవ్వించారు. స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచారు.
ఇదిలా ఉంటే ఇందులో ముఖ్యంగా ఇమ్మాన్యుయెల్, కెవ్వు కార్తీక్, నూకరాజులు మాత్రం తమ రియల్ స్టోరీలు చెప్పి భావోద్వేగానికి గురి చేశారు. అందరిని చేత కంటతడి పెట్టించారు. వాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇమ్మన్యుయెల్ నాన్న ఇంటికి దూరంగా ఉండే వారట. కుటుంబ పోషణ కోసం ఇతర ప్రాంతంలో ఉండి పనిచేసేవాడట. అయితే ఓ సారి ఇమ్మాన్యుయెల్కి బాగా జ్వరం వచ్చిందట. పది రోజులైనా తగ్గడం లేదు.
వాళ్లది పల్లెటూరు, పిల్లాడికి ఏమైందో ఏమో తెలియడం లేదు. ఆసుపత్రికి తీసుకెళ్లే పరిస్థితి లేదు. కానీ చాలా రోజులు తర్వాత ఇంటికెళ్లాలనుకున్నాడు ఇమ్మాన్యుయెల్తండ్రి. ఇంటికెళ్లాక ఇమ్ము జ్వరంగా మంచాన పడి ఉండటంతో చలించిపోయాడు.
ఘోళ్లున్న విలపించాడు. భార్యని ఇచ్చి పట్నానికి ఆసుపత్రికి పంపించాడు. అతనికి బాగైతే తీసుకురా? లేదంటే తీసుకురాకు, బాబు లేడనే విషయానే నేను తట్టుకోలేనని విలపించాడు. ఈ విషయాన్ని స్కిట్ ద్వారా చూపించి అందరి చేత కన్నీళ్లు పెట్టించాడు ఇమ్మాన్యుయెల్.
ఆ తర్వాత స్టేజ్పై తండ్రితో, తను తమ బాధలు చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తను పస్తులుండి మాకు మూడుపూటల తిండి పెట్టారని చెప్పి అందరిని ఏడిపించారు. ముఖ్యంగా వర్ష బాగా విలపించింది.
మరోవైపు కెవ్వు కార్తీక్ ఫాదర్తోనూ ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. తల్లికి క్యాన్సర్ అని చెప్పి షాక్ ఇచ్చాడు. తమ జీవితంలో కష్టం వచ్చి ఇంకా అది అలానే ఉండిపోయిందన్నారు.
తల్లి క్యాన్సర్తో పోరాడుతుందని, తండ్రిసేవ చేస్తున్నారని చెప్పాడు. రెండేళ్లుగా వాళ్ల నాన్నే తమకి వండి పెడుతున్నాడని, ఇంటిపనులు చూసుకుంటున్నాడని చెప్పాడు కార్తీక్.
తను కూడా స్కిట్ రూపంలో తమ ఫ్యామిలీలోని కన్నీటి గాథని స్టేజ్పై చూపించి ఏడిపించాడు. ఇంద్రజ సైతం కన్నీళ్లు పెట్టుకుంది.
వీరితోపాటు నూకరాజు సైతం తమ కన్నీటి గాథని చెప్పాడు. అమ్మా నాన్న సముద్రంలోకి వేటకి వెళ్లేవారని, ఓ రోజు వర్షం బాగా వస్తుందని, పడవ మధ్యలో ఇరుక్కుపోయిందని, తల్లిదండ్రులు అక్కడ చాలా ఇబ్బంది పడ్డారని తెలిపారు.
పిల్లల కోసం ఒకరినొకరు ప్రాణాలు త్యాగాలు చేసుకునేందుకు సిద్ధపడ్డారని తెలిపారు. ఈ విషయాన్ని స్కిట్ రూపంలో చూపించి ఏడిపించాడు. స్టేజ్పై వాళ్ల నాన్న కూడా ఈ విషయాన్ని చెప్పి విలపించారు.
ఇలా మనకు నవ్వులు పండిస్తూ ఉన్న జబర్దస్త్ కమెడీయన్ల తెలియని కన్నీటి గాథలు అందరిచేత కన్నీళ్లు పెట్టిస్తున్నారు.ఈ స్కిట్లు సుడిగాలి సుధీర్ హోస్ట్ గా చేస్తున్న `శ్రీదేవి డ్రామాకంపెనీ`లో ప్రదర్శించడం విశేషం.
ఈ ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా ఈ ఎపిసోడ్ప్రసారం కానుంది. ఇందులో ఇంద్రజ కూడా పాల్గొనడం విశేషం.