నిత్యా మీనన్ టాలీవుడ్ రీ ఎంట్రీ.. యంగ్ హీరో సినిమాకు సైన్ చేసిన మలబారు బ్యూటీ..
నిత్యా మీనన్ గుర్తుందా.. చాలా కాలంగా సినిమాలకు.. మరీ ముఖ్యంగా తెలుగు తెరకూ దూరంగా ఉంటోంది మలయాళ బ్యూటీ. అవ్వడానికి ఆమె మలయాళమే అయినా.. తెలుగింటి ఆపడుచుమాదిరి కలిసిపోయింది. మరి ఈబ్యూటీ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
పేరుకు మలయాళ అమ్మాయి కాని.. అచ్చ తెలుగు ఆడపడుచులా ఉంటుంది నిత్యామీనన్. ఆమె ఎక్కువగా అవకాశాలు సాధించింది తెలుగులోనే. మలయాళం, తమిళ్ కంటే కూడా.. తెలుగులోనే నిత్యా మీనన్ సినిమాలు ఎక్కువగా చేసింది. కానీ తెలుగులో ఆమె అసలు కనిపించకుండా పోయింది. టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ స్థానానికి ఎదిగిపోయింది. నిత్య మీనన్ నటించిన సినిమాలు ఎంత రియలిస్టిక్ గా ఉంటాయో.. ఆమెకు ఉన్ ఫ్యాన్స్ బేస్ ఏంటో తెలిసిందే.
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని నటించిన అలా మొదలైంది అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది నిత్య. తెలుగు ఆడియన్స్ బొద్దుగా ఉన్న హీరోయిన్లను పెద్దగా ఆదరించరు. కాని నిత్య మీనన్ ను మాత్రం బాగా రిసీవ్ చేసుకున్నారు. మంచి మంచి సినిమాలు చేసి.. తెలుగు లో మంచి పేరు తెచ్చుకుంది నిత్యా మీనన్. కుర్రాళ్ళ మనసులను కొల్లగొట్టింది .
Nithya menon
నిత్య చేసే సినిమాలన్నీ.. యూత్ ను బాగా ఆఖర్షించాయి. మలయాళ అమ్మాయి అయినా.. తెలుగు చక్కగా మాట్లాడుతూ.. తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటూ.. ఇతర హీరోయిన్లకు ఆదర్శంగా నిలిచింది నిత్య. ఈ అందాల ముద్దుగుమ్మ చాలా కాలంగా సినిమాలు చేయడంలేదు.
Nithya menon
తెలుగులో అసలు కనిపించడమే మానేసింది. ఆమధ్య ఓ ఓటీటీ మూవీతో పలకరించిన బ్యూటీ.. ఆతరువాత అసలు కనిపించనే లేదు. ఒక టాప్ డైరెక్టర్ ఆమెను చీట్ చేశాడు అని ఆ కారణంగానే తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంది అని తెగ ప్రచారం జరిగింది. అందులో నిజం ఎంతో తెలియదు.
ఇక నిత్య ఎక్కడా అంటూ ఆమె ఫ్యాన్స్ వెతుక్కుంటున్న టైమ్ లో వారికిఓ గుడ్ న్యూస్ తెలిసింది. ఇక ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అమ్మడు తెలుగు సినిమాకి సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా తాను గతంలో జంటగా నటించిన నితిన్ తో సినిమా చేయబోతుందట నిత్యా. నిత్యామీనన్ – నితిన్ కాంబోలో సూపర్ డూపర్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.
వీళ్ల కాంబోలో ఇష్క్ – గుండెజారి గల్లంతయ్యిందే.. రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కాగా ఇప్పుడు వీళ్ళ కాంబోలో మరో సినిమా రాబోతుంది . వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా తమ్ముడు. ఈ సినిమాలో ఓల్డ్ హీరోయిన్ లయ కూడా కీలకపాత్రలో కనిపించబోతుంది . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ గెస్ట్ పాత్రలో నిత్యామీనన్ కనిపించబోతుందట.
Ishq Re-Release
ఇప్పుడు హీరోయిన్ గా నటించే అవకాశం లేదు కాని.. నితిన్ తో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగానే ఈ హీరోయిన్ ఈ మూవీలో గెస్ట్ రోల్ కు ఓప్పుకుందట. గతంలో విజయ్ దేవరకోండ హీరోగా నటించిన గీత గోవిందంలో కూడా గెస్ట్ రోల్ చేసింది నిత్య. ఇక నితిన్ సినిమాలో కూడా ఇలానే కనిపించబోతున్నట్టు టాక్. మరి అందులో నిజం ఎంతో తెలియాల్సి ఉంది.