డబ్బు కోసం దిగజారిపోతున్నారు... హీరోయిన్ మీనా ఫైర్!
హీరోయిన్ మీనా తన రెండో పెళ్లి వార్తలపై మరోసారి ఫైర్ అయ్యారు. డబ్బుల కోసం దిగజారిపోతున్నారని మీనా ఆవేదన వ్యక్తం చేసింది. మీనా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Meena
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన మీనా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 90లలో పలు భాషల్లో స్టార్ హీరోల సరసన నటించింది. అనేక బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది. ఇప్పటికీ మీనా సీనియర్ హీరోల సరసన వయసుకు దగ్గ పాత్రలు చేస్తుంది. హీరోయిన్ హోదా కొనసాగిస్తోంది.
కాగా 2022లో మీనా జీవితంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో కన్నుమూశాడు. దాంతో ఆమె ఒంటరి అయ్యింది. 2009లో బెంగుళూరు కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ని మీనా వివాహం చేసుకుంది. వీరికి ఒక కూతురు. భర్త మరణంతో మీనా ఆవేదనకు గురైంది.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
47 ఏళ్ల మీనా రెండో వివాహం చేసుకుంటున్నారని పలుమార్లు కథనాలు వెలువడ్డాయి. అలాగే హీరో ధనుష్ తో ఆమెకు ఎఫైర్ నడుస్తుందని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పట్లో రెండో వివాహం చేసుకునే ఆలోచన నాకు లేదని మీనా వివరణ ఇచ్చింది. అయినప్పటికీ పుకార్లు ఆగడం లేదు.
Meena
తాజా ఇంటర్వ్యూలో ఈ కథనాలను ఉద్దేశించి మరోసారి మాట్లాడింది. సోషల్ మీడియా దిగజారిపోతోంది. డబ్బులు కోసం ఏదైనా రాస్తారా? వాస్తవాలు తెలుసుకుని రాయండి. అది అందరికీ మంచిది. నాలాగే దేశంలో అనేక మంది ఒంటరి మహిళలు ఉన్నారు. నాతో పాటు నా కూతురు భవిష్యత్తు కూడా ముఖ్యం.
Meena
ప్రస్తుతం నాకు రెండో పెళ్లి ఆలోచనలు లేదు. ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే నేను మీకు స్వయంగా చెబుతాను. భవిష్యత్ నిర్ణయాల గురించి మీకు అప్పుడే నేను ఏమి చెప్పలేను కదా... అని అన్నారు. భవిష్యత్ లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ప్రస్తుతానికి రెండో పెళ్లి ఆలోచన లేదని మీనా తేల్చి చెప్పింది.