- Home
- Entertainment
- Keerthy Suresh :వావ్.. ఎరుపు వర్ణంలో మెరుపులు.. మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్న కీర్తి సురేష్
Keerthy Suresh :వావ్.. ఎరుపు వర్ణంలో మెరుపులు.. మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్న కీర్తి సురేష్
కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది.

కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. మహానటి ఒక్క చిత్రం చాలు కీర్తి సురేష్ నటన గురించి చెప్పడానికి. ఆ చిత్రంతో కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది.
నేను శైలజ చిత్రంతో Keerthy Suresh టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టి కీర్తి సురేష్ పై పడింది. కీర్తి సురేష్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేస్తుంది. కానీ ఎప్పుడూ హద్దులు దాటేలా అందాలు ఆరబోయలేదు. నటనతోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. సౌత్ టాప్ హీరోయిన్ల సరసన చేరింది.
కీర్తి సురేష్ స్కిన్ షో చేయకుండానే అందంతో మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా రెడ్ డ్రెస్ లో ఆమె ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో వైల్డ్ ఫైర్ లా వ్యాపిస్తున్నాయి. అంతలా కీర్తి అందంతో కట్టి పడేస్తోంది. చూపు తిప్పుకోలేని విధంగా ఉన్న కీర్తి ఫోజులకు ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. చూసిన ప్రతి ఒక్కరిని కీర్తి సురేష్ తన గ్లామర్ తో సమ్మోహన పరుస్తోంది.
కీర్తి సురేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
మహానటి చిత్రంలో కీర్తి సురేష్ నట విశ్వరూపమే ప్రదర్శించింది. సావిత్రి పాత్రలో ఆమె ఒదిగిపోయి నటించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. దీనితో దర్శకులు కూడా కీర్తి సురేష్ ని గ్లామర్ రోల్స్ తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలకు ఎంపిక చేసుకుంటున్నారు.
అలాగే కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ చిత్రంలో కీలక పాత్రకు ఎంపికైంది. ఈ చిత్రాల్లో ఆమె చిరంజీవి సోదరిగా నటించబోతోంది. ఈ ఏడాది కీర్తి సురేష్ రంగ్ దే, అన్నాత్తే చిత్రంలో మెరిసింది.