- Home
- Entertainment
- బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే..చిత్రాల విషయంలో సిద్దార్థ్ ఇంత ఆవేదనతో ఉన్నాడా..జరిగిన అన్యాయంపై ఓపెన్ గా..
బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే..చిత్రాల విషయంలో సిద్దార్థ్ ఇంత ఆవేదనతో ఉన్నాడా..జరిగిన అన్యాయంపై ఓపెన్ గా..
తమిళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చినప్పటికీ హీరో సిద్దార్థ్ తెలుగు కుర్రాడిలా మారిపోయాడు. పక్కింటి కుర్రాడిలా అనిపించే సిద్దార్థ్ తన సెటిల్డ్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
తమిళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చినప్పటికీ హీరో సిద్దార్థ్ తెలుగు కుర్రాడిలా మారిపోయాడు. పక్కింటి కుర్రాడిలా అనిపించే సిద్దార్థ్ తన సెటిల్డ్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి మెమొరబుల్ చిత్రాలు సిద్దార్థ్ కెరీర్ లో ఉన్నాయి.
బొమ్మరిల్లు చిత్రంతో సిద్దార్థ్ కెరీర్ పీక్ స్టేజ్ కి వెళ్ళింది. యువతని, ఫ్యామిలీ ఆడియన్స్ ని రంజింపజేస్తూ చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రం అది. ఆ తర్వాత సిద్దార్థ్ కి వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ప్రస్తుతం సిద్దార్థ్ సినిమాలు చేస్తున్నాడు కానీ మునుపటి వాడి వేడి కనిపించడం లేదు.
బొమ్మరిల్లు చిత్రంలో సిద్దార్థ్ తండ్రికి నచ్చినట్లు ఉండలేక సతమతమవుతూ అతడు పండించిన నటన అద్భుతం. నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో కూడా సిద్దార్థ్ పెర్ఫార్మన్స్ అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ రెండు చిత్రాల విషయంలో సిద్దార్థ్ కి ఒక ఆవేదన ఉంది.
ఇటీవల ఇంటర్వ్యూలో సిద్దార్థ్ తన ఆవేదన బయట పెట్టాడు. బొమ్మరిల్లు చిత్రం అన్ని విషయాల్లో సూపర్ సక్సెస్ అయింది. కానీ ఆ మూవీ విషయంలో నాకొక బాధ ఉంది. ఆ చిత్రానికి చాలా నంది అవార్డులు వచ్చాయి కదా.. ఒక్క మనిషికి మాత్రం ఆ చిత్రంలో నంది అవార్డు రాలేదు. అది నేనే. బొమ్మరిల్లు చిత్రంలో నిర్మాత దిల్ రాజు, ప్రకాష్ రాజ్, డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్, జెనీలియా, అబ్బూరి రవి వీళ్ళందరికీ వివిధ విభాగాల్లో నంది అవార్డులు వచ్చాయి. కానీ సిద్దార్థ్ కి మాత్రం నంది ఇవ్వలేదు అనేది వస్తావం.
నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం విషయంలో కూడా సిద్దార్థ్ ఆవేదన అదే. త్రిష, శ్రీహరి, ఆర్ట్ డైరెక్టర్ వివేక్, ఫిమేల్ కమెడియన్ సంతోషి ఇలా అందరికి నంది అవార్డులు వచ్చాయి. ఆ చిత్రానికి కూడా సిద్దార్థ్ కి నంది దక్కలేదు. దీనితో సిద్దార్థ్ తన మనసులో ఆవేదన బయట పెట్టారు.
నాకు ఎందుకు నంది అవార్డు రాలేదు అనే విషయంలో స్ట్రాంగ్ రీజన్ ఎవరైనా చెప్పగలరా అని సిద్దార్థ్ ప్రశ్నించారు. ఆ ఏడాది నాకన్నా బాగా నటించిన హీరోలు ఉన్నారా అంటూ సిద్దార్థ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకంటే చెత్తగా నటించిన వారికి కూడా అవార్డులు వచ్చాయి అని సిద్దార్థ్ అన్నారు. నెటిజన్లు కూడా సిద్దార్థ్ కి దక్కాల్సిన క్రెడిట్ దక్కలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.