త్రిషకు కాబోయేవాడు శింబు కాదట...నచ్చినవాడెవడో చెప్పేసింది...!
స్టార్ హీరోయిన్ గా దశాబ్దానికి పైగా సౌత్ ని ఏలింది త్రిష. చిన్న చిన్న పాత్రలతో వెండితెరకు పరిచయమైన త్రిష తన టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. టాలీవుడ్ లో ఆమె స్టార్ డమ్ ఒకప్పుడు ఓ రేంజ్ లో ఉండేది
చిరంజీవి, మహేష్, ఎన్టీఆర్, పవన్, ప్రభాస్ వంటి అందరూ టాప్ స్టార్స్ తో ఆడిపాడారు త్రిష. ప్రస్తుతం తమిళంలో త్రిష ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య మూవీలో త్రిష నటించాల్సి ఉండగా, ప్రాజెక్ట్ నుండి మధ్యలో తప్పుకున్నారు. త్రిష అవకాశాన్ని కాజల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ పొన్నియన్ సెల్వంలో త్రిష కీలక రోల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ మొదలైంది.
ఇక 37ఏళ్ల త్రిష పెళ్లిపై కోలీవుడ్ లో తరచుగా వార్తలు వస్తూ ఉంటాయి. అప్పట్లో రానా మరియు త్రిష ప్రేమాయణం నడిపారని వార్తలు రావడం జరిగింది.
మిహికాతో రానాకు పెళ్లి కుదిరిన తరువాత త్రిష చేసిన సోషల్ మీడియాలో పోస్ట్లు ఆ వార్తలకు బలం చేకూర్చాయి.
చాలా కాలం క్రితమే ఓ పారిశ్రామిక వేత్తతో త్రిష నిశ్చితార్ధం జరిగింది. కారణం ఏదైనా ఆ పెళ్లి జరగలేదు.
ఐతే కొంత కాలంగా త్రిష మరియు శింబు మధ్య ఎఫైర్ నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు రావడం జరిగింది.
తాజా ఇంటర్వ్యూలో వీటన్నింటిపై క్లారిటీ ఇచ్చింది త్రిష. తనకు నచ్చిన వాడు, తన వృత్తిని , అభిప్రాయాలను గౌరవించే వాడు దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటాను అన్నారు. పరోక్షంగా శింబుతో తన పెళ్లి అనేది అవాస్తం అని తెలియజేశారు.
తనకు నచ్చిన వాడు దొరకని నేపథ్యంలో జీవితాంతం ఒంటరిగా ఉంటానని త్రిష చెప్పడం కొసమెరుపు.