ప్రభాస్ రాముడైతే...సీతగా అనుష్క, ఫ్యాన్స్ డిమాండ్..!
ఆదిపురుష్ లో రామునిగా ప్రభాస్ కనిపించనుండగా మరి ఆయన పక్కన సీత పాత్ర ఎవరు చేస్తున్నారనే సందేహం ఆయన ఫ్యాన్స్ తో పాటు, సగటు మూవీ లవర్ మదిలో కదలాడుతుంది. ఐతే ప్రభాస్ రాముడైతే ఆయన పక్కన సీతగా ఒక్క అనుష్క మాత్రమే కరెక్ట్ అంటున్నారు అభిమానులు.
టాలీవుడ్ హిట్ పెయిర్ గా ప్రభాస్, అనుష్క శెట్టి ఉన్నారు. వీరిద్దరూ కలిసి నాలుగు సినిమాల వరకు చేశారు. బిల్లా చిత్రంతో మొదలైన వీరి వెండితెర బంధం బాహుబలి వరకు కొనసాగింది. ఈ మూడు చిత్రాలతో పాటు దర్శకుడు కొరటాల డెబ్యూ మూవీ మిర్చి మూవీలో కూడా అనుష్క నటించారు.
ఆ నాలుగు చిత్రాలు విజయం సాధించడం విశేషం. ఇక నిన్న ప్రభాస్ రామాయణ గాథగా తెరకెక్కనున్న ఆదిపురుష్ అనే పౌరాణిక చిత్రం ప్రకటించారు. దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించనున్న ఈ మూవీ హిందీ, తెలుగుతో పాటు మొత్తం ఐదు భాషలలో విడుదల కానుంది.
ప్రభాస్ మొదటిసారి ఓ మైథలాజికల్ రోల్ లో కనిపించనుండడం ఆసక్తి రేపుతోంది. అది కూడా హిందువులు అత్యంత గౌరవప్రదంగా పూజించే రాముడు కావడం ఫ్యాన్స్ తో పాటు సినీప్రియులు చిత్రం పట్ల అత్యంత ఆసక్తి కనబరుస్తున్నారు. ఆరడుగుల ప్రభాస్ నీలమేఘశ్యాముడుగా వెండితెరపై అద్భుతం చేయనున్నాడని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
రామాయణంలో కీలకమైన, రాముడికి జంటైన సీత పాత్ర ప్రాముఖ్యత గిరించి అందరికీ తెలిసిందే. ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ రాముడిగా చేస్తుండగా ఆమె పక్కన సీతగా అందరి మదిలో మెదిలిన పేరు అనుష్క. రామావతారంలో ఉన్న ప్రభాస్ పక్కన సీతగా అనుష్క తప్ప ఎవరూ బాగుండరు అనేది ప్రేక్షకుల అభిప్రాయం.
ఆదిపురుష్ మూవీలో సీతగా అనుష్కనే తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ కోరికను తెలియజేస్తున్నారు. తమ అభిప్రాయం పరిగణలోకి తీసుకొని సీతగా అనుష్కను తీసుకోవాలని కోరుకుంటున్నారు. అనుష్క ప్రభాస్ కి కలిసొచ్చిన హీరోయిన్ కావడంతో, ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ లో సీత పాత్ర కోసం అనుష్కను తీసుకోవాలని కోరుకుంటున్నారు.
మరి అభిమానుల కోరికను ఆదర్శపురుష్ దర్శక నిర్మాతలు ఎంత వరకు పరిగణలోకి తీసుకుంటారో చూడాలి. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్న ఈమూవీ 2022లో విడుదల కానుంది. అలాగే ప్రభాస్ రాదే శ్యామ్, నాగ్ అశ్విన్ తో కమిటైన 21వ చిత్రం పూర్తి చేయాల్సివుంది.