ఐశ్వర్య రాయ్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మణిరత్నం, ఆహీరోయిన్ తో మాట్లాడొద్దంటూ...?
ఇండియన్ లెజండరీ డైరెక్టర్ మణిరత్నం... ఇండియన్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాడట. అంత పెద్ద హీరోయిన్ కు.. అంతటి సీనియర్ డైరెక్టర్ కోపం తెచ్చుకోవడం ఏందుకు..? అసలేం జరిగింది..?
ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీ అంతట వినిపిస్తున్న ఒకటే మాట పొన్నియన్ సెల్వన్. ఈ మూవీ ప్రమోషన్స్ హడావిడి గట్టిగా నడుస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సబంధించిన చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. అందులో డైరెక్టర్ మణిరత్నం... ఇండియన్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం కూడా బయటకు వచ్చింది. ఇంతకీ ఆయన.. అంత పెద్ద స్టార్ కు వార్నింగ్ ఎందుకు ఇచ్చాడోతెలుసా..?
మరో వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతుంది పోనియన్ సెల్వన్ మూవీ. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు ముందుకు ఈనెల 30న రాబోతుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ ను జోరుగా చేస్తున్నారు టీమ్. ప్రతీ నిమిషాన్ని వేస్ట్ చేయకుండా.. వాడుకుంటున్నారు మేకర్స్. ప్రమోషన్స్ లో తెగ సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే డైరెక్టర్ మణిరత్నం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.. ఈ సందర్భంగా.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మణిరత్నం ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టాడు. అది కూడా స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్, త్రిషల గురించి ఓ ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాడు. దాంతో ఈ ఇద్దరు హీరోయిన్ల ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
తాజా ఇంటర్వ్యూలో మణిరత్నం మాట్లాడుతూ. త్రిష-ఐశ్వర్యారాయ్ లకు తాను వార్నింగ్ ఇచ్చినట్టు ఇండైరెక్టర్ గా ఒప్పుకున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ విషయంలో తాను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందన్నారు. ఆ విషయంలో తాను చాలా కష్టపడ్డానన్నారు మణిరత్నం.. ఓ సందర్భంగలో వారిద్దరి మీద కోప్పాడాల్సి వచ్చిందన్నారు మణిరత్నం.
ఈ సినిమాలో ఇద్దరు సీరియస్ రోల్స్ లో కనిపిస్తారు. ఇద్దరి మధ్య చాలా సీరియస్ గా డైలాగ్స్ వస్తుంటాయి. అటువంటి టైమ్ లో వీరి మధ్య ఫ్రెండ్ షిప్ కారణంగా ఇద్దరి మధ్య సీరియస్ నెస్ తీసుకురావడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది అన్నారు మణిరత్నం. దీంతో నేనే ఈ సినిమా పూర్తి అయ్యే వరకు వారిద్దరిని మాట్లాడుకోవద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చాను. అన్నారు మణి.
అంత దూరం పెట్టినా కూడా.. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చేసి సీన్స్ తెరకెక్కించేటప్పుడు చాలా టైం పట్టింది అంటూ చెప్పుకొచ్చారు మణిరత్నం. ఈ ఒక్క సందర్భంతో ఆయన ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో తెలుస్తోంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఇక ఈమూవీ మరో బాహుబలి అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. చూడాలి ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ సాధిస్తుందో.