ఎర్రతివాచీపై వయ్యారాల రాజహంస.. ప్రియమణి శారీ అందాలను చూస్తే ఊపిరాగిపోవాల్సిందే..
గ్లామర్ బ్యూటీ ప్రియమణి ఎర్రతివాచీపై రాజహంసలా వయ్యారాలు పోతుంది. తన శారీ అందాలతో కుర్రాళ్ల గుండెలకు గాయం చేస్తుంది. హాట్ పోజులతో రెచ్చగొడుతుంది. ఎర్రతివాచీపై ప్రియమణి హోయలు చూసి ఊపిరాగిపోతే అది ఏమాత్రం అతిశయోక్తి కాదనే చెప్పాలి. అంతగా తన స్టన్నింగ్ ఫోటోలతో పిచ్చెక్కిస్తున్న ప్రియమణి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
ప్రియమణి తాజాగా గ్రీన్ బార్డర్తో డిజైన్ చేసిన బ్లాక్ శారీలో రెడీ అయి ఫోటోలకు పోజులిచ్చింది.
ఎర్రతివాచీపై ఆమె రాజహంసలా ఉందనే చెప్పాలి. రెడ్ కార్పెట్పై హోయలు పోయింది. వయ్యారాలా ఒలకబోసింది.
మరోవైపు మెడలో ముత్యాల హారం ధరించి ఫోటోలకు పోజులిచ్చి, వాటిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోగా, అవి తెగ వైరల్ అవుతున్నాయి. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లో లక్షల వ్యూస్ రావడం విశేషం.
`ఢీ` ఛాంపియన్స్ 13వ సీజన్ కోసం ప్రియమణి ఇలా పోజులిచ్చింది. ఈ రోజు రాత్రి ఈ డాన్స్ ప్రోగ్రామ్ ప్రసారం కానున్న విషయం తెలిసిందే.
ప్రతి వారం ఇలా సరికొత్తగా, గ్లామరస్గా ముస్తాబై ఫ్యాన్స్ ని కనువిందు చేస్తుంది ప్రియమణి అలియాస్ పిల్లు మణి.
రెడ్ కార్పెట్పై ప్రియమణి ఓ దేవకన్యలా కనిపిస్తుందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. గార్జియస్, స్టన్నింగ్, మోస్ట్ బ్యూటీఫుల్ అంటూ ఆమె అందాలను ప్రశంసిస్తున్నారు.
ప్రియమణి గ్లామర్ ఫోటోలు కుర్రాళ్లకి నిద్ర కరువు చేస్తుందని చెప్పాలి.
`ఢీ` డాన్స్ లో రష్మీ గౌతమ్, దీపికా పిల్లి, పూర్ణ సైతం మెరుస్తుంటారు. కానీ ఈ మధ్య కుర్ర బ్యూటీలను మించిన అందంతో మెస్మరైజ్ చేస్తుంది ప్రియమణి.
ప్రస్తుతం ఆమె వరుసగా సినిమాలతోనూ బిజీగా ఉంది. తెలుగులో `విరాటపర్వం`, `నారప్ప` చిత్రాల్లో నటిస్తుంది.
దీంతోపాటు తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ అరడజనుకుపైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. హిందీలోనూ `మైదాన్`లో నటిస్తుంది పిల్లుమణి.