Guppedantha Manasu: భర్తని వెనకేసుకొస్తున్న ధరణి.. రిషి ప్రవర్తనకి షాకైన వసుధార!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. అన్న మీద విపరీతమైన నమ్మకాన్ని పెంచుకున్న ఒక తమ్ముడు కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఆగస్టు 8 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నావల్ల తప్పు జరిగిందని ఒప్పుకున్నాను. అందుకే ఎన్నో అవమానాలు భరిస్తూ వచ్చాను అయినా రిషి సార్ అర్థం చేసుకోవడం లేదు అంటూ బాధపడుతుంది వసుధార. నువ్వు నీ కోణం నుంచే ఆలోచిస్తున్నావు కానీ ఆయన కోణం నుంచి ఆలోచించడం లేదు. జరిగిందేమి చిన్న విషయం కాదు. నువ్వు రక్షించినంత మాత్రాన ఆయన మనసులో బాధ చెరిగిపోదు కదా ఆయన కూడా మనిషే కదా నువ్వే అర్థం చేసుకో.
మనసుకి మనిషికి మధ్య ఒక సన్నని పొర ఉంటుంది. ఆ పోర చిరిగిపోయిన రోజు కచ్చితంగా ఆయన నిన్ను అర్థం చేసుకుంటారు అని కూతురికి ధైర్యం చెప్పి వెళ్ళిపోతాడు చక్రపాణి. ఆ తర్వాత ఆలోచనలో ఉన్న వసుధారకి జగతి ఒక మెసేజ్ పెడుతుంది. గురుదక్షిణ విషయంలో మహేంద్ర దగ్గర ఒకసారి ఇబ్బంది పడ్డావు ఆ తరువాత నా దగ్గర ఇబ్బంది పడ్డావు. నీ చేత చేయించకూడని పని చేయించాను. ఇకపై నీ విషయంలో నేను కానీ మహేంద్ర గాని జోక్యం చేసుకోము.
కానీ నిన్ను ఒక కోరిక కోరుతున్నాను. ఇది నీ గురువుగా కాదు కేవలం రిషి తల్లిదండ్రులుగా మాత్రమే అడుగుతున్నాము. దయచేసి రిషి ని మామూలు మనిషిని చెయ్యు, మరిచిపోయిన ప్రేమని మళ్లీ పునరుద్ధరించేలాగా చేయు అంటూ రిక్వెస్ట్ చేస్తుంది జగతి. సీన్ కట్ చేస్తే శైలేంద్ర రౌడీ ఫోన్ కి ఫోన్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేద్దామనుకుంటాడు రిషి కానీ ఇంతలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది.వెంటనే పోలీసులకి ఫోన్ చేసి కాలేజీలో లంచ్ అవర్ లో కలుద్దాం అని చెప్తాడు రిషి.
ఏం జరుగుతుందో అర్థం కాక ఫ్రెస్టేట్ అవుతాడు శైలేంద్ర. అదే కోపంతో కిందికి వచ్చేసరికి భార్య కాఫీ ఇస్తుంది. కోపంతో ఆ కాఫీని నేలకేసి కొడతాడు శైలేంద్ర. ఆ శబ్దానికి ఫణీంద్ర కిందికి వచ్చి ఏం జరిగింది ఎందుకు కాఫీ కప్పుని నేలకేసి కొట్టావు.. రోజురోజుకి నీ ప్రవర్తన మరీ దిగజారిపోతుంది. అసలు కప్పు నేలకేసి కొట్టవలసిన అంత కోపం ఎందుకు వచ్చింది అంటూ నిలదీస్తాడు. ఇందులో ఆయన పొరపాటు ఏమీ లేదు నా చేయి జారిపోయి కప్పు పగిలిపోయింది అని భర్తని వెనకేసుకొస్తుంది ధరణి.
నువ్వు చెప్తున్నది నిజమేనా.. అయినా ఎందుకు నీ భర్త దగ్గర భయపడతావు. నువ్వు ఇలా భయపడుతూ ఉంటే నీ కాపురం కుదుటపడదు అని ధరణికి చెప్పి భార్యని ప్రేమించాలి కానీ భయపెట్టకూడదు. తను మారాలని చూస్తున్నావు కానీ నువ్వే మారే ప్రయత్నం చెయ్యు ఎందుకంటే తను చేసే ప్రతి పనిలోనే క్లారిటీ ఉంటుంది. నువ్వు చేసే పనిలో నీకే క్లారిటీ ఉండదు అని కొడుక్కి చివాట్లు పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఫణీంద్ర.
అక్కడి నుంచి అందరు వెళ్లిపోయిన తర్వాత జగతి ఎందుకు అబద్ధం చెప్పావు అని ధరణిని అడుగుతుంది. ఆయనకి మావయ్య అంటే కాస్త భయం ఉంది చిన్నతయ్య. ఇప్పుడు నిజం బయటపడితే ఉన్న భయం కాస్త పోతుంది. అప్పుడు మరింత రెచ్చిపోతారు అంటుంది ధరణి. నీ మంచి మనసే నీకు శ్రీరామరక్ష అంటుంది జగతి. సీన్ కట్ చేస్తే కాలేజీకి వచ్చిన పోలీసుని చూసి ఏంటి సార్ కాలేజీలో ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది వసుధార.
లేదు రిషి సార్ రమ్మన్నారు అని చెప్తాడు ఎస్ఐ. వసుధార ఎస్ఐ ని రిషి క్యాబిన్ కి తీసుకెళ్తుంది. అప్పుడు రిషి ఫోన్ గురించి ఎస్సై కి చెప్తాడు. ఈలోపు రిషికి వేరే ఇంపార్టెంట్ కాల్ రావడంతో మాట్లాడటానికి బయటికి వెళ్తాడు. శైలేంద్ర మళ్లీ రౌడీ సెల్ కి ఫోన్ చేసి అసలు ఎందుకు ఫోన్ మాట్లాడటం లేదు, ఏం జరిగింది అని అడుగుతాడు. ఆ మాటలని గుర్తు పడుతుంది వసుధార.
ఎస్సై హలో అనటంతో గొంతు మారింది అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు శైలేంద్ర. ఇంతలో రిషి లోపలికి వచ్చేసరికి ఎస్సై ఆ గొంతు గుర్తుపట్టారా అని వసుధారని అడుగుతాడు. ఆ గొంతు రిషి సార్ వాళ్ళ అన్నయ్య శైలేంద్రది అని చెప్తుంది వసుధార. అవునా అని ఆశ్చర్యంగా అడుగుతాడు రిషి. అవును సార్ ఆ రోజు మేము తప్పు చేయటానికి ఈరోజు మీ మీద జరుగుతున్న అటాక్ కి కారణం అతనే.
కానీ మీరు నమ్మరు అనే ఉద్దేశంతో మేము చెప్పలేదు అంటుంది వసుధార. ఇప్పుడు మాత్రం నమ్ముతానని ఎలా అనుకుంటున్నావు. ఆరోజు నా మీద అభియోగం మోపారు. ఈరోజు మా అన్నయ్య మీద అభియోగం మోపుతున్నారా.. మా అన్నయ్యకి నేనంటే ప్రాణం అని అన్నయ్యని వెనకేసుకొస్తాడు రిషి. అతని మాటలకి షాక్ అవుతుంది వసుధార. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.