MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Devatha: తప్పు తెలుసుకున్న దేవి.. మాధవకు మరో షాకిచ్చిన ఆదిత్య, రాధ!

Devatha: తప్పు తెలుసుకున్న దేవి.. మాధవకు మరో షాకిచ్చిన ఆదిత్య, రాధ!

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్ 16వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం... 

2 Min read
Navya G
Published : Aug 16 2022, 01:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... దేవి,రుక్మిణి ఇంటికి వస్తారు. ఎక్కడికి వెళ్లావు అని మాధవ్ అడగాలా ఆఫీసర్ సారు మమ్మల్ని ఒక ప్రదేశానికి తీసుకువెళ్లారు అక్కడ చాలామంది పిల్లలు అమ్మ నాన్నలు లేకుండా కూడా సంతోషంగా ఉన్నారు. అలాంటిది నాకు నా నాయన లేకపోయినా అమ్మ ఉన్నది కదా నేను అంతకన్నా ఎక్కువ సంతోషంగా ఉండాలి. నేను అందులో బాధపడాల్సిన అవసరం లేదు ఈరోజు నుంచి  నాయన ఎక్కడుంటే నాకెందుకు? ఎలాగుంటే నాకెందుకు? నేను ఈరోజు నుంచి మా నాయన గురించి అడగను అని అంటుంది.
 

26

అప్పుడు మాధవ్ చిన్న పిల్లల్ని అలాంటి ప్రదేశానికి తీసుకెళ్తే బాధపడతారు కదా అని అనగా దేవి, నేనేం బాధపడట్లేదు నాయనా నేను చాలా సంతోషంగా ఉన్నాను కదా నాకు ఇంకా నాయన లేకపోయినా పర్వాలేదు అని అంటుంది. అప్పుడు రుక్మిణి, దేవమ్మకి నేను ఆఫీసర్ సారు ఉన్నంతవరకు ఏమీ అవ్వదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మాధవ్, ఇలా ఉంటే ఇంక నన్ను రాధ పెళ్లి చేసుకోదు కనుక ఇంకో కొత్త ప్లాన్ వేసి దేవిని నా అదుపులోకి తెచ్చుకోవాలి అని అనుకుంటాడు.తర్వాత సీన్ లో ఆదిత్య తన ఇంట్లో బాధపడుతూ ప్రస్తుతానికి అయితే దేవిని ఆపగలిగాను.
 

36

కానీ తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు సత్య వచ్చి ఇంత దీనంగా ఏం ఆలోచిస్తున్నావ్ అని అడగగా నువ్వు ఇంకా పడుకోలేదా అని ఆదిత్య అంటాడు. నీ బాధ ముందు నాకు నిద్ర రావడం లేదు ఏం జరిగింది అసలు ఎందుకు అలా ఉన్నావు అని అనగా ఆదిత్య సకులు చెప్పి తప్పించుకుంటాడు.అప్పుడు సత్య నువ్వు అబద్ధం చెప్తున్నవు అని తెలుసు కానీ ఎందుకు చెప్తున్నావో తెలియడం లేదు అని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత సీన్లో దేవి చిన్నయి పడుకొని ఉంటారు.
 

46

అప్పుడు రుక్మిణి భాగ్యముతో ప్రస్తుతానికైతే పిల్ల మనసు చెడిపోకుండా ఆపగలిగాము కానీ రాబోయే ప్రమాదం గురించి ఆలోచిస్తే భయమేస్తుంది. ఆఫీసర్ సార్ తన నాయనా అని తెలిస్తే దేవమ్మ చాలా ఆనందపడుతుంది కానీ అలాంటి అవకాశం రాకుండా మనకు చేసేసాడు ఆ మాధవ్ అని బాధపడుతూ ఉండగా దేవి లెగుస్తుంది. రుక్మిణి కంగారుగా ఎప్పుడు లేచావు అమ్మ అంటే ఇప్పుడే లేచానమ్మ మంచి నీళ్లు కావాలి అని అంటుంది. భాగ్యమ్మ దేవికి మంచినీళ్లు ఇస్తుంది.
 

56

ఆ తర్వాత సీన్లో రుక్మిణి టేబుల్ క్లీన్ చేస్తున్నప్పుడు మాధవ్ అక్కడికి వచ్చి ఆ టేబుల్ మీద నీళ్లు పోస్తాడు ఇలాగా నువ్వు ప్రతిరోజు టేబుల్ క్లీన్ చేస్తూనే ఉండాలి అలాగే నేను దేవి మనసులో ఎంత చెత్త పూసిన మీరు తుడుస్తారు కానీ నేను మళ్ళీ దేవి మనసులో చెత్త పేరుస్తాను అని బెదిరించి ఫోన్ వచ్చేసరికి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మాధవ్. ఏవైనా కొత్త ప్లాన్ వేసాడా ఏం చేయాలి అని మనసులో అనుకుంటుంది రుక్మిణి. ఆ తర్వాత సీన్లో సత్య వాళ్ళ అక్కకి పాలు ఇస్తుంది అక్కడ వాళ్ళు కొంచెం సేపు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు.
 

66

ఆ తర్వాత సీన్లో మాధవ్ ఎవరికో ఫోన్ చేసి నాకు నలుగురు అనాధలు కావాలి అని అంటాడు. ఈ లోగా అక్కడికి కొన్ని మంది గ్రామస్తులు వచ్చి సర్పంచ్ గారితో మాట్లాడాలి పొలాల గురించి ఆఫీసర్ సార్ తో ఈ మాట చెప్పమని అని అనగా నేను చెప్తాను అని మాధవ్ ఆ పేపర్లు తీసేసుకుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved