గోవాలో క్రేజీ లవ్ బర్డ్స్ నయన్, విఘ్నేష్
లాక్డౌన్ వల్ల, కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన ప్రేమ జంట ఒక్కసారిగా విహారానికి వెళితే.. వారి ఎంజాయ్కి అవధులుండవనే చెప్పాలి. ఇప్పుడు అలాంటి అవధుల్లేని ఎంజాయ్మెంట్ని తమిళ ప్రేమ జంట పొందుతుంది. గోవాకి వెళ్ళి మరి ఎంజాయ్ చేస్తుంది. మరి ఆ జంట ఎవరో చూస్తే..
తమిళంలో మోస్ట్ క్రేజీ లవ్బర్డ్స్ ఎవరైనా ఉన్నారంటే స్టార్ హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గత కొన్నాళ్ళుగా వీరిద్దరు ఏజ్కి అతీతంగా ప్రేమలో పీకల్లోతు మునిగి తేలుతున్నారు. ఎక్కడ చూసినా వీరిద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. లాక్డౌన్ వల్ల నిర్భంధంగా హాలీడేస్ తీసుకున్న ఈ ప్రేమ జంట ఇప్పుడు స్వేచ్చగా విహరిస్తున్నారు.
ఈ ప్రేమ జంట గోవాకి చెక్కేసింది. కూల్ వెదర్లో ఎంజాయ్ చేస్తున్నారు. అందులో భాగంగా ప్రియుడు విఘ్నేష్ శివన్ తన ప్రియురాలు నయనతార ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు.
ఇందులో పచ్చని పార్క్ లో నయనతార ఎంజాయ్ చేస్తూ కనిపించింది. సరదాగా పార్క్ అంతటా కలియ తిరిగింది. పార్క్ లోని పువ్వూలను చేతులోకి తీసుకుని ఆనందిస్తుంది.
గోవాలోని కండోలిమ్ బీచ్ పార్క్ లోని దిగిన నయనతార ఫోటోలను విఘ్నేష్ శివన్ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. `తప్పనిసరి సెలవుల తర్వాత వెకేషన్ కోసం బయటకు వచ్చాం` అని విఘ్నేష్ శివన్ కామెంట్ చేశారు.
ఈ ఫోటోలకు అభిమానుల నుంచి కామెంట్ల వెల్లువ కొనసాగుతుంది. ఎంజాయ్ అంటూ, తమదైన స్టయిల్లో కామెంట్ చేస్తున్నారు. అయితే ఇందులో విఘ్నేష్ శివన్ లేకపోవడం గమనార్హం.
ఈ ఏడాది `దర్బార్`లో మెరిసిన నయనతార ప్రస్తుతం `నెట్రికన్`, `మూకుథి అమ్మన్`, `అన్నాత్తే`, `కాథువాకుల రెండు కాధల్` చిత్రాల్లో నటిస్తుంది. `కాథువాకుల రెండు కాధల్` చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.