ఫొటోలు:హీరోయిన్ గా '30 ఇయర్స్ ఇండస్ట్రీ' పృథ్వీ కూతురు
భారతి క్రియేషన్స్, కథెరిన్ ఫిల్మ్ వర్క్స్, మౌనిక ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మిస్తున్న నూతన చిత్రం ‘ఎస్కె’ గురువారం ప్రసాద్ ల్యాబ్లో ప్రారంభమైంది. చిరంజీవి కుంచల్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. సర్దార్ సుర్జీత్ సింగ్ నిర్మాత. సీనియర్ నటుడు పృథ్వీ(30 ఇయర్స్ ఇండస్ట్రీ) కుమార్తె శ్రీలు ఈ చిత్రంతో హీరోయిన్గా పరిచయం కానుంది.
ఇండస్ట్రీలో వారసుల హవా కొనసాగుతూనే ఉంది. దర్శకులు, నిర్మాతలు, నటీనటుల పిల్లలు వారసత్వాన్ని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది వారసులతో ఇండస్ట్రీ నిండిపోతోంది.
ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి ఎక్కువ మంది వారసులు ఇండస్ట్రీకి పరిచయం కాగా, ఆ తర్వాత నందమూరి ఫ్యామిలీ, ఘట్టమనేని ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు కమెడీయన్స్ కూడా వారి వారసులను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు.
తాజాగా కమెడీయన్ పృథ్వీ తనయ హీరోయిన్గా పరిచయం అవుతుంది. భారతి క్రియేషన్స్, కథెరిన్ ఫిల్మ్ వర్క్స్, మౌనిక ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మిస్తున్న నూతన చిత్రం ‘ఎస్కె’ గురువారం ప్రసాద్ ల్యాబ్లో ప్రారంభమైంది. చిరంజీవి కుంచల్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. సర్దార్ సుర్జీత్ సింగ్ నిర్మాత. సీనియర్ నటుడు పృథ్వీ(30 ఇయర్స్ ఇండస్ట్రీ) కుమార్తె శ్రీలు ఈ చిత్రంతో హీరోయిన్గా పరిచయం కానుంది.
దర్శకుడు, హీరో ‘‘చిరంజీవి కుంచల్ మాట్లాడుతూ ‘‘అన్ని కమర్షియల్ హంగులతో కామెడీ, థ్రిల్లర్గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. నా మొదటి మూవీ ‘జీఎఫ్’ విడుదలకు సిద్ధంగా ఉండగానే మరో సినిమా ప్రారంభం కావడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు. 30 రోజులపాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తామని చెప్పిన నిర్మాత సినిమా ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుందని పేర్కొన్నారు.చిత్రంలో పృథ్వీ కీలక పాత్రలో కనిపిస్తారు’’ అని చెప్పారు.
హీరోయిన్ శ్రీలు మాట్లాడుతూ ‘‘కథ వినగానే అంగీకరించా. ఈ చిత్రంతో హీరోయిన్గా పరిచయం కావడం ఆనందంగా ఉంది. సినిమాకు కథ, స్ర్కీన్ప్లే ప్రధాన బలం’’ అన్నారు.
నిర్మాత సర్దార్ సుర్జీత్ సింగ్ మాట్లాడుతూ… 30 రోజులపాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం. సినిమా ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. పృథ్వీ కీలక పాత్రలో కనిపిస్తారు’’ అని చెప్పారు.
గడ్డం నవీన్, అభిరామ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్గా వలి పని చేస్తుండగా, శ్రీ వెంకట్ మ్యూజిక్ అందిస్తున్నారు. దర్శకత్వం: చిరంజీవి కుంచల్.
30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ విషయానికి వస్తే ఎక్కడికి వెళ్లినా వివాదాలు మాత్రం వీడటం లేదు. కమెడియన్గా సత్తా చాటి పొలిటికల్ టర్న్ తీసుకుని వైసీపీ పార్టీ తరుపున ఎస్వీబీసీ చైర్మన్ అయిన పృథ్వీ.. కొంతకాలానికి ఆ పదవిని ఊడగొట్టుకున్నాడు.
రీసెంట్గా ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఎపిసోడ్కి గెస్ట్గా వచ్చిన పృథ్వీ.. ఊరిని బాగు చేస్తా అంటూ శ్రీమంతుడు అవతారం ఎత్తి.. అక్కడ కూడా హాస్యం పండించారు. అయితే గౌతమ్ రాజు పేరు ఓ సందర్భంలో తీయడంతో ఇష్యూ వివాదంగా మారింది.