MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రజినీకాంత్ ముందు మోహన్ బాబు పరువు తీసిన చిరంజీవి, మెగాస్టార్ ఏమన్నరంటే..?

రజినీకాంత్ ముందు మోహన్ బాబు పరువు తీసిన చిరంజీవి, మెగాస్టార్ ఏమన్నరంటే..?

మెగాస్టార్ చిరంజీవి.. మంచు మోహన్ బాబు మధ్య కోల్డ్ వార్ సంగతి అందరికి తెలిసిందే.  ఒ సందర్భంలో... మోహన్ బాబు స్నేహితుడు, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ముందు మోహన్ బాబుకు షాక్ ఇచ్చాడు చిరంజీవి ఇంతకీ విషయం ఏంటంటే..?  

3 Min read
Mahesh Jujjuri
Published : Nov 04 2024, 06:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మెగాస్టార్ చిరంజీవి.. మంచు మోహన్ బాబు.. టాలీవుడ్ వీరిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బయటకు బాగామాట్లాడుకున్నట్టే ఉంటారు కాని లోపల జరగాల్సి కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో వీరి మధ్య మనస్పర్ధలు బయటకు వస్తూనే ఉన్నాయి. తెలుగు సినిమా వజ్రోత్సవాల టైమ్ లో స్టార్ట్ అయిన వార్.. ఇప్పటికీ.. అప్పుడప్పుడు రాజుకుంటూనే ఉంది. 

Also Read: ప్రభాస్ కు రెండు మేజర్ సర్జరీలు జరిగాయా.. రామ్ చరణ్ చెప్పిన రహస్యం ఏంటంటే..?

25


ఈక్రమంలో నవ్వుకుంటూనే వారి మధ్య వైరాన్ని బయటపెట్టుకుంటునారు. ఇలానే ఓ సందర్భంలో మోహన్ బాబు కు షాక్ ఇచ్చాడు చిరంజీవి. అది కూడా తన ప్రాణ స్నేహితుడు. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఎదురుగా మోహన్ బాబు పరువుతీసినంత పనిచేశాడు చిరంజీవి. గతంలో జరిగిన ఈ సంఘటన ఆతరువాత కూడా వైరల్ అవుతూనే ఉంది. రోబో సినిమా తెలుగు ఈవెంట్ దీనికి వేధిక అయ్యింది. 

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సినిమాల్లో రోబో ఒకటి. ఈమూవీ ఎంత సంచలనం అయ్యిందో అందరికి తెలిసిందే. ఈసినిమా తెలుగులో రిలీజ్ చేస్తున్న సందర్భంలో.. హైదరాబద్ లో ఓ ఈవెంట్ జరిగింది. దీనికి మెగాస్టార్ చిరంజీవితో పాటు.. తన స్నేహిడుడైన మోహన్ బాబును కూడా పిలిచారు రజినీకాంత్. అయితే మోహన్ బాబు మాట్లాడుతూ.. పదే పదే రజినీకాంత్ ను వాడు వీడు.. అంటూ మాట్లాడారు. ఎంత స్నేహితుడైనా.. నిండు సభలో అలా మాట్లాడటం తప్పు.. సభా మార్యాదను కాపాడాలి కదా అని చాలామంది అభిప్రాయపడ్డారు. 

 

35

సరే స్నేహితుడు కాబట్టి రజినీకాంత్ ఏమీ మాట్లాడకపోయినా.. చిరంజీవి మాత్రం ఈ విషయంలో స్పందించారు. రజినీకాంత్ గారు అని మాట్లాడండి.. సభామర్యాద అని మోహన్ బాబుకు గుర్తు చేశారు. దాంతో మోహన్ బాబు సభలోనే మాట్లాడుతూ.. చిరంజీవి ఇలా అంటున్నాడు రజినీకాంత్ గారు అనమని అంటున్నాడు.. అది ఎలాగబ్బ.. అసలు అలవాటు లేదు కాద.. అలా అనడం సాధ్యం కాదు కదా అన్నట్టు మాట్లాడారు. 

ఆతరువాత కూడా చిరంజీవి మాట్లాడుతూ.. మోహన్ బాబు జలస్ ఫీల్ అవుతున్నారని.. అలా అయితే ఎలాగమ్మ బాబు.. జలసీ ఉంటే లోపల దాచుకోవాలి ఇలా బయటపెట్టకూడదు అంటూ సరదాగా వాఖ్యానించారు. ఇలా రజినీకాంత్ ముందు మోహన్ బాబుపై చిరు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇదొక్క సంఘటనే కాదు..వీరిద్దరి మధ్య ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. రీసెంట్ గా కూడా మెగా మంచు కాంట్రవర్సీలు బయటకు వచ్చాయి.  

45

 

రీసెంట్ గా ఏఎన్నార్ అవార్డు అందుకున్న చిరంజీవి గతంలో జరిగిన వివాదాన్ని  పరోక్షంగా తెరపైకి తీసుకువచ్చారు. అప్పట్లో వజ్రోత్సవాలలో తనకు లెజండరీ అవార్డ్ ఇస్తుంటే కొందరు అడ్డుకున్నారని. దానిని నేను తీసుకోకుండా వదిలేశానని.. ఇక ఇప్పుడు ఏఎన్నార్ అవార్డ్ తో తను ఇంట గెలిచాను.. రచ్చ గెలిచాను అంటూ కామెంట్స్ చేశారు. దాంతో మరోసారి మెగా -  మంచు వివాదాలు బయటకు వచ్చాయి. 

ఇక అసలు గతంలో  ఏం జరిగిందో చూసుకుంటే.. తెలుగు సినిమా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాలు చేసుకున్న సమయంలో వీరిమధ్య వివాదం ముదిరిపాకాన పడింది. చిరంజీవికి లెజండరీ అవార్డ్ ఇవ్వాలని ఇండస్ట్రీ అంతా నిర్ణయిస్తే.. తీవ్రంగా వ్యతిరేకించారు మోహన్ బాబు. నేను లెజండ్ కాదా..? ఇండస్ట్రీలో ఇంకా లెజండ్స్ లేరా అంటూ పెద్ద రచ్చ చేశారు. దాంతో ఈ విషయంలో చిన్నబుచ్చుకున్న చిరంజీవి. ఆ అవార్డ్ తీసుకోడానికి నిరాకరించారు. 

55

అది తీసుకునే రోజు ముందు ఉంది అంటూ కౌంటర్ గా పెద్ద పెద్ద వాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఈ రెండు ఫ్యామిలీల మధ్య వివాదం ఏదో ఒక రకంగా నడుస్తూనే ఉంది. మధ్య మధ్యలో ఏదో ఒక సందర్భంలో బయటపడుతూనే ఉంది. ఈమధ్య కాలంలో 2021 మా ఎన్నికల టైమ్ లో మెగా వర్సెస్ మంచు అన్నట్టుగా మారిపోయింది. 

మెగా ఫ్యామిలీ ప్రకాశ్ రాజును పోటీకి నిలబెట్టగా.. మంచు విష్ణు కూడా పోటీలో నిలబడ్డారు. ఇక నందమూరి ప్యామిలీ నుంచి బాలయ్య కూడా విష్ణుకుసపోర్ట్ చేశారు. ఇక మంచు విష్ణు గెలిచారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు చిరంజీవి మీద ఆరోపణలు చేశాడు.

చిరంజీవి అంకుల్ నన్ను పోటీ నుండి తప్పుకోమన్నాడని మీడియా ఎదుట కామెంట్స్ చేశాడు.ఆ గొడవ చాలా కాలం నడిచింది. ఇక  అంతకు ముందు కూడా దాసరి నారాయణ రావు  చనిపోయినప్పుడు ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి ఉండాలని అందరు కోరుకున్నారు. కాని మోహన్ బాబు మళ్లీ అడ్డుపడ్డారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved