చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్..ఈ బిగ్ స్టార్స్ ని అప్పటి వరకు టచ్ చేసే వారే లేరు..
మెగాస్టార్ స్టార్ చిరంజీవి, పవరర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ అండ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లను ఇప్పట్లో టచ్ చేయడం ఎవరికీ సాధ్యంకాదా? మూడేళ్ల వరకు వీరు ఇంకెవరినీ తమ వద్దకి రానివ్వరా ? అంటే అవునని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అవును ఈ ముగ్గురిని టచ్చేయడం ఎవరి తరం కాదు. వీరితోపాటు అడవిశేషు, సత్యదేవ్లు కూడా టచ్ చేయలేని విధంగా మారిపోయారు.
అవును.. చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్ మూడేళ్ల వరకు ఫుల్ బిజీగా ఉన్నారు. వరుసగా నాలుగైదు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తీరిక లేని విధంగా ఉన్నారు. వీరితో సినిమా చేయాలంటే దర్శకులకు మరో మూడేళ్లు వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు డేట్స్ లేవని చెప్పొచ్చు.
మెగా స్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత రెండు ప్రాజెక్టులు `ఖైదీ నెంబర్ 150`, `సైరా` విషయాలో ఆచితూచి వ్యవహరించారు. మార్కెట్ లెక్కలు, ఆయన ఇసినమాలకు ఆదరణ ఎలా ఉంటుందో తేలిపోయింది. దీంతో బ్యాక్ టూ బ్యాక్ కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. (చిరంజీవి అరుదైన ఫోటో)
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆయన `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. కాజల్ హీరోయిన్గా, రామ్చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో టెంపుల్ టౌన్ సెట్ హైలైట్ గా నిలువనుంది. మరోవైపు సామాజిక సందేశం, వాణిజ్య అంశాలు మేళవింపుగా ఈ సినిమా ఉండనుంది. దీన్ని ఈ సమ్మర్లోనే రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు.
`ఆచార్య` సెట్లో చిరంజీవిని కలిసిన మురళీమోహన్, శరత్ కుమార్.
దీంతోపాటు ఇటీవలే `లూసీఫర్` రీమేక్ని స్టార్ట్ చేశారు చిరంజీవి. మోహన్రాజా దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నటించే ఇతర తారాగణం ఇంకా ఫైనల్ కాలేదు. దీంతోపాటు తన నెక్ట్స్ మరో రెండు సినిమాలపై క్లారిటీ ఇచ్చారు చిరంజీవి.
`లూసీఫర్`తోపాటు మెహర్ రమేష్తో తమిళ సూపర్ హిట్ `వేదాళం` రీమేక్లో నటిస్తున్నారు. దీంతోపాటు బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తి కావడానికి 2023 వరకు అవుతుందని చెప్పొచ్చు. మరి చిరు జోరు చూస్తుంటే రెండేళ్లలోనే పూర్తి చేసేలా ఉన్నారు. ఈ లెక్కన చిరుతో సినిమా చేయడం మరో రెండేళ్ల వరకు ఏ దర్శకుడికి సాధ్యం కాదు.
తమిళ స్టయిలీష్ స్టార్ అజిత్తో చిరంజీవి. అరుదైన ఫోటో వైరల్.
అలాగే పవన్ కళ్యాణ్ విషయంలోనూ అదే పరిస్థితి. ఆయన ప్రస్తుతం `పింక్` రీమేక్ `వకీల్ సాబ్` చిత్రంలో నటిస్తున్నారు. ఇది చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలోనే విడుదల కానుంది. దీంతోపాటు ఇటీవల సాగర్ కె చంద్ర దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఇది మలయాళ సినిమా `అయ్యప్పనుమ్ కోషియమ్`కి రీమేక్. ఇందులో రానా మరో హీరోగా నటిస్తున్నారు.
దీంతోపాటు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది ఇటీవల షూటింగ్ ప్రారంభించుకుంది. త్వరలోనే ఈ సినిమా సెట్లో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నట్టు సమాచారం.
దీంతోపాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు పవన్. `గబ్బర్ సింగ్` తర్వాత వీరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో దీనిపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలోగానీ, వచ్చే ఏడాదిగాని ప్రారంభమవుతుంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇదే కాకుండా జానీ మాస్టర్తో ఓ సినిమా ఉంటుందని, అలాగే మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఈ లెక్కన పవన్ ఈ సినిమాలు పూర్తి చేయడానికి మూడేళ్లు పడుతుంది. దీంతో ఆ మూడేళ్ల వరకు ఏ దర్శకుడు పవన్ని టచ్ చేయలేరనే చెప్పాలి. (రామ్చరణ్, సుష్మితలతో పవన్. అరుదైన ఫోటో)
ఇక ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆయన నాలుగు పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో `రాధేశ్యామ్` చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇది త్వరలోనే పూర్తవుతుందని, ఏప్రిల్లో దీన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు.
దీంతోపాటు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తూ `ఆదిపురుష్` సినిమా చేస్తున్నారు ప్రభాస్. ఓం రౌత్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. `రామాయణ్` నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇది త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందులో రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తుండగా, సీతగా కృతి సనన్ని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట.
మరోవైపు ఇప్పటికే `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్` చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు, సినిమాని కూడా ప్రారంభించారు. త్వరలోనే దీన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తవడానికి ఈ ఏడాది పడుతుంది.
ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్తో పాన్ ఇండియా సినిమాగా రూపొందే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె కీలక పాత్రలు పోషిస్తున్నారు.
దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్లు ఈ నెల 29, అలాగే ఫిబ్రవరి 26న మరో అప్డేట్ ఇస్తామని చెప్పారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇది పూర్తవడానికి 2023 వరకు పట్టే ఛాన్స్ ఉంది. దీంతో ప్రభాస్ని టచ్ చేయడానికి కూడా మూడేళ్లు పడుతుందని తెలుస్తుంది.
వీరే కాదు యంగ్ హీరోలు అడవి శేషు, మరో హీరో సత్యదేవ్లు కూడా మరో మూడేళ్లు ఫుల్ బిజీగా ఉన్నారు.