ఉదయ్ కిరణ్ సినిమా ఆపేయాలని చిరంజీవి కాంపౌండ్ నుంచి వార్నింగ్.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన నిర్మాత..
లవర్ బాయ్ ఇమేజ్తో టాలీవుడ్లో స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్కి సంబంధించిన పలు షాకింగ్ విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఓ నిర్మాత చెప్పిన విషయాలు దుమారం రేపుతున్నాయి.
ఉదయ్ కిరణ్ హీరోగా ఎంట్రీ తోనే వరుస విజయాలు అందుకుని ఓవర్నైట్లో స్టార్అయ్యారు. బ్యాక్ టూ బ్యాక్ ఆయన నటించిన `చిత్రం`, `నువ్వు నేను`, `మనసంతా నువ్వే` చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. హ్యాట్రిక్ హీరో అయ్యారు. దీంతో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. లేడీ ఫాలోయింగ్ బాగా పెరిగింది. అమ్మాయిలు ఆయన్ని డ్రీమ్ బాయ్గా ఊహించుకునే వారు.
`కలుసుకోవాలని` చిత్రంతో ఫర్వాలేదనిపించినా, ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలు వరుసగా పరాజయం చెందాయి. దీంతో ఆయన కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. `శ్రీరామ్`, `హోళీ`, `నీ స్నేహం`, `నీ జోడి` చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. `నీకు నేను నాకు నువ్వు` చిత్రం ఓకే అనిపించింది. కానీ పరాజయాలు ఆయన్ని వెంటాడాయి. దీంతో కోలుకోలేకపోయారు. ఆర్థిక ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి.
మ్యారేజ్ చేసుకోగా, కుటుంబాన్ని పోషించడం కష్టమైంది, సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో మరింతగా డిప్రెషన్లోకి వెళ్లిన ఆయన ఆత్మహత్యకి పాల్పడినట్టు తెలుస్తుంది. ఇదే విషయం ప్రచారంలో ఉంది. 2013లో ఆయన హృదయ విదారక స్థితిలో సూసైడ్ చేసుకోవడం టాలీవుడ్ని కలచివేసింది. షాక్కి గురి చేసింది. ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ ని శోకసంద్రంలో ముంచెత్తింది.
మ్యారేజ్ చేసుకోగా, కుటుంబాన్ని పోషించడం కష్టమైంది, సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో మరింతగా డిప్రెషన్లోకి వెళ్లిన ఆయన ఆత్మహత్యకి పాల్పడినట్టు తెలుస్తుంది. ఇదే విషయం ప్రచారంలో ఉంది. 2013లో ఆయన హృదయ విదారక స్థితిలో సూసైడ్ చేసుకోవడం టాలీవుడ్ని కలచివేసింది. షాక్కి గురి చేసింది. ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ ని శోకసంద్రంలో ముంచెత్తింది.
ఇప్పటికే ఉదయ్ కిరణ్ జయంతి, వర్థంతి రోజుల్లో అభిమానులు లవర్ బాయ్ లాంటి తమ అభిమాన హీరోని గుర్తు చేసుకుంటుంటారు. ఆయన మాటలను, ఆయన ఫోటోలను, ఆయన పాటలను వైరల్ చేస్తూ ప్రేమని చాటుకుంటుంటారు. తాజాగా నేడు(జూన్ 26) ఉదయ్ కిరణ్ 42వ జయంతి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు ఉదయ్ కిరణ్ కి సంబంధించిన ఆసక్తికర విషయాలను, ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్లను వైరల్ చేస్తున్నారు.
అందులో భాగంగా తాజాగా ఓ న్యూస్ పేపర్ క్లిప్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలో కలకలం సృష్టించింది. ఇది ఆ సమయంలోనే పబ్లిష్ అయినా దాన్ని ఇప్పుడు వైరల్ చేయడం కలకలం సృష్టిస్తుంది. ఇందులో చిరంజీవిని ఫ్యామిలీ ఇన్వాల్వ్ చేయడం విశేషం. ఉదయ్ కిరణ్తో సినిమా తీయకుండా చిరంజీవి కాంపౌండ్ అడ్డుకున్నట్టు ఓ నిర్మాత తెలిపారు.
అయితే ఉదయ్ కిరణ్కి అవకాశాలు తగ్గిపోవడానికి, ఆగిపోవడానికి చిరంజీవినే కారణమని అనేక రూమర్స్ ఇండస్ట్రీలో వైరల్ అయ్యాయి. తన కూతురితో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసినందుకు కక్షతోనే చిరు ఇలా చేశారంటూ అప్పట్లో వార్తలు దుమారం రేపాయి. సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి అనాటి క్లిప్ వైరల్ కావడం మరింత కలకలం సృష్టిస్తుంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో `హరిహర వీరమల్లు` చిత్రాన్ని నిర్మిస్తున్న ఏ ఎం రత్నం అప్పట్లో రెండు భాషల్లో ఉదయ్ కిరణ్తో ఓ సినిమాని ప్రారంభించారు. దాదాపు సినిమా 80శాతం పూర్తయ్యింది. త్వరలోనే సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనుకోని కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది. సినిమా ఆగిపోయిన ఏడాది వరకు ఆ నిర్మాత కనిపించలేదు. హైదరాబాద్కి రాలేదు.
ఆయన హైదరాబాద్లో జరిగిన ఓ ఫంక్షన్కి అడగ్గా, ఆయన అసలు విషయాన్ని వెల్లడించారు. చిరంజీవి కాంపౌండ్ నుంచి ఒత్తిడి మేరకే సినిమాని ఆపివేయాల్సి వచ్చిందని వెల్లడించారు. కానీ ఆ విషయాన్ని అప్పటి మీడియా పెద్దగా ఎక్స్ పోజ్ చేయలేదు. కారణం అప్పటికే చిరంజీవి టాలీవుడ్లో మెగాస్టార్గా వెలుగుతున్నారు. ఆయనంటే, ఆయన వెనకాల ఉన్న నిర్మాత అల్లు అరవింద్ ఉన్నారని భయపడ్డారట. ఇండస్ట్రీని ఆయనే కాదు,నలుగురు నిర్మాతలు శాషిస్తున్నారు. వారికిఎదురు ప్రశ్నించి,ఎవ్వరూ ఏం చేయలేరు. దీంతో ఉదయ్ కిరణ్ కెరీర్ అయిపోయిందని అప్పుడే ఫిక్స్ అయ్యారట. ఊహించినట్టే జరిగింది. ఇది ఓ న్యూస్ పేపర్లో రాసిన వార్త. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది.
ఉదయ్ కిరణ్ జయంతి సందర్బంగా ఈ క్లిప్ చక్కర్లు కొడుతూ, మరోసారి చిరంజీవిని వివాదంలోకి లాగుతుంది. అయితే ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకి, చిరంజీవికి సంబంధం లేదని ఆయన సిస్టర్ శ్రీదేవిక్లారిటీ ఇచ్చారు. డిప్రెషన్ కారణంగా ఇది జరిగిందని, ఆమె తెలిపింది. ఆయనకు ల్యాండ్లు కూడా ఉన్నాయని తెలిపారు. ఉదయ్ ఆర్థిక ఇబ్బందులతో చనిపాయరనేదాంట్లో నిజం లేదన్నారు.
ఉదయ్ కిరణ్ సక్సెస్, క్రేజ్ చూసిన చిరంజీవి.. అప్పటికే లవ్ బ్రేకప్తో ఉన్న ఉదయ్ కిరణ్కి భరోసాగా నిలిచారని, తన కూతురు సుస్మితని వివాహం చేసుకోవాలని తెలిపారట. ఆయన ఒప్పుకోవడంతో 2003లో సుస్మితతో ఎంగేజ్మెంట్ జరిగిందని, కానీ ఇద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థాల వల్ల ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారట. ఇక్కడే చిరంజీవికి మండిందని టాక్. అయితే కొంత గ్యాప్ తర్వాత ఉదయ్ కిరణ్ 2012లో విషితతో వివాహం జరిగింది. 2014 జనవరి 5న ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకి పాల్పడిన విషయం తెలిసిందే.