పెళ్లికి సిద్ధపడిన ఛార్మి..కారణం ఆ గొడవేనా?.. ఇంతకి ఆ డైరెక్టర్ రియాక్షనేంటి?
ఇన్నాళ్లు పెళ్లి ఊసేత్తని ఛార్మి ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకుందా? త్వరలోనే ఆమె వైవాహిక బంధంలోకి అడుగుపెడుతుందా? అంటే అవుననే సమాధానం టాలీవుడ్లో వినిపిస్తుంది. మరి ఆ దర్శకుడి రియాక్షనేంటనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
ఛార్మి ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించించింది. ప్రభాస్, నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్, జగపతిబాబు, బాలకృష్ణ, సుమంత్, శ్రీకాంత్, నితిన్ ఇలా దాదాపు చాలా మంది స్టార్ హీరోలతో ఆడిపాడింది. కానీ ప్రస్తుతం నటనకు దూరమై నిర్మాతగా తన ప్యాషన్ని చాటుకుంటోంది.
2002లో `నీతోడు కావాలి` అనే చిత్రంతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అయిన ఛార్మి, `శ్రీ ఆంజనేయం`, `గౌరీ`, `చంటి`, `మాస్`, `చక్రం`, `అనుకోకుండా ఒక రోజు`, `పొలిటికల్ రౌడీ`, `అల్లరి పిడుగు`, `చుక్కల్లో చంద్రుడు`, `లక్ష్మీ`, `స్టైల్`, `పౌర్ణమి`, `చిన్నోడు`, `రాఖీ`, `మంత్ర`, `సుందరాకాండ`, `మైఖేల్ మదన కామరాజు`, `మనోరమ`, `దొంగలమూట`, `మంగళ` వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
హీరోయిన్గా కాస్త డౌన్ అయిన తర్వాత టాలీవుడ్ స్టార్ డైరెక్టర్కి పూరీ జగన్నాథ్కి దగ్గరైంది. వీరిద్దరు అప్పట్లో డేటింగ్ చేశారనే వార్తలు వినిపించాయి. పూరీకి మ్యారేజ్ అయినప్పటికీ ఆయనతో ఛార్మి లవ్లో మునిగి తేలిందని, ఆయనతోనే ఉంటుందనే ప్రచారం జరిగింది. అందుకోసం ఛార్మికి తన ఆస్తిలో కొంత రాసిచ్చాడని బహిరంగంగానే ప్రచారం జరిగింది.
అందుకు తగ్గట్టే చాలా కాలంగా ఛార్మి.. పూరీకి సంబంధించిన ప్రొడక్షన్స్ చూసుకుంటుంది. పూరీ టూరింగ్టాకీస్, పూరీ కనెక్ట్స్ ల నిర్వహణ, నిర్మాణ బాధ్యతలన్నీంటిని ఛార్మి చూసుకుంటోంది. వీరిద్దరే మొత్తం డీల్ చేస్తున్నారు. అంతకు ముందు దేవిశ్రీ ప్రసాద్తోనూ ఛార్మి డేటింగ్ చేసిందని వార్తలొచ్చాయి. ఆయనతో ప్రేమ విఫలమైన్న తర్వాత పూరీకి దగ్గరయ్యిందని, వినిపించాయి. ఇంకా ఆ పుకార్లు కొనసాగుతున్నాయి.
అయితే ఛార్మి విషయంలో పూరీకి, ఆయన భార్యకి చాలా సార్లు గొడవలయ్యాయని వినిపించింది. ఇటీవల మరోసారి ఛార్మిపై పూరీ భార్య ఫైర్ అయ్యారట. ఆమెతో గడపడం ఎందుకు పెళ్లి చేసుకోమని చెప్పిందట. బయట నానా రకాలుగా విమర్శలు ఎదుర్కోవడం కంటే మ్యారేజ్ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి కామెంట్లు వినిపించవని గట్టిగానే చెప్పిందట.
ఇదిలా ఉంటే తాజాగా ఛార్మికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. తాను పెళ్లికి సిద్ధమవుతుందని తెలుస్తుంది. పూరీతో ఉండటంతో భవిష్యత్లో తాను ఒంటరయ్యే అవకాశం ఉందని, ఇకనైనా తనకంటూ ఓ జీవితం ఉండాలని, అందుకే కొత్త జీవితాన్ని పెళ్లితో స్టార్ట్ చేయాలని భావించిందట. అందుకు ఓ అబ్బాయిని కూడా చూసుకుందనే ప్రచారం జరుగుతుంది. గతంలో తనకెలాంటి తోడు అవసరం లేదని చెప్పిన ఛార్మి ఇప్పుడు మాత్రం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందట. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
ఇటీవల సెక్సీ యోగాతో మతులు పోగొట్టిన ఛార్మి ఇప్పుడు తన పూరీ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ పతాకాలపై విజయ్ దేవరకొండ హీరోగా `లైగర్` చిత్రాన్ని తెలుగు, హిందీలో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.