- Home
- Entertainment
- రైతు బిడ్డ జల్సాలు మామూలుగా లేవుగా, అందుకు శివాజీ సపోర్ట్... మరి సాయం సంగతి ఏమిటీ?
రైతు బిడ్డ జల్సాలు మామూలుగా లేవుగా, అందుకు శివాజీ సపోర్ట్... మరి సాయం సంగతి ఏమిటీ?
పల్లవి ప్రశాంత్ లగ్జరీ కారు కొన్నాడు. కారు కొనేందుకు తన గురు శివాజీని వెంటబెట్టుకుని పోయాడు. కొత్త కారు కోన్ ఆనందాన్ని తన ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. అయితే పల్లవి ప్రశాంత్ బాధ్యతను నెటిజెన్స్ గుర్తు చేస్తున్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Pallavi Prashanth
బిగ్ బాస్ సీజన్ 7 లో సంచలనం నమోదు అయ్యింది. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. టాప్ సెలెబ్స్ ని వెనక్కి నెట్టి పల్లవి ప్రశాంత్ కప్పు గెలవడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Pallavi Prashanth
బిగ్ బాస్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ రూ. 35 లక్షల నగదు బహుమతిని అందుకున్నాడు. రూ. 50 లక్షలు ప్రైజ్ మనీ కాగా... ప్రిన్స్ యావర్ 4వ స్థానంలో రూ. 15 లక్షలు తీసుకుని రేసు నుంచి తప్పుకున్నాడు. దాంతో పల్లవి ప్రశాంత్ పొందాల్సిన ప్రైజ్ మనీ తగ్గింది. నగదు బహుమతితో పాటు ఒక కారు, నెక్లెస్ కూడా ఇచ్చారు.
Pallavi Prashanth
మారుతీ సుజుకీ బ్రీజా కారు ధర రూ. 15 లక్షలు. నెక్లెస్ ధర కూడా రూ. 15 లక్ష్లలు. ఈ బహుమతులు పల్లవి ప్రశాంత్ కి వెంటనే ఇవ్వలేదు. షో ముగిసిన ఐదు నెలలకు జాన్ అలుకాస్ ప్రకటించిన నెక్లెస్ పల్లవి ప్రశాంత్ కి అందజేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పల్లవి ప్రశాంత్ తెలియజేశాడు.
Pallavi Prashanth
కాగా బహుమతులు కాకుండా ప్రైజ్ మనీ రూ. 35 లక్షలు పేద రైతులకు పంచుతానని పల్లవి ప్రశాంత్ ప్రామిస్ చేసిన సంగతి తెలిసిందే. టాక్స్ కటింగ్స్ పోను పల్లవి ప్రశాంత్ కి రూ. 16 లక్షలు వస్తాయట. ఈ మొత్తం పల్లవి ప్రశాంత్ పేద రైతులకు దానం చేయాల్సి ఉంది.
Pallavi Prashanth
కాగా పల్లవి ప్రశాంత్ తాజాగా ఓ లగ్జరీ కారు కొన్నాడు. మారుతీ సుజుకీ చెందిన రెడ్ కలర్ ఓపెన్ టాప్ కారును సొంతం చేసుకున్నాడు. దీనికి సంబందించిన వీడియో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.
Pallavi Prashanth
తన గురువు శివాజీతో పాటు ఈ కారు కొనేందుకు పల్లవి ప్రశాంత్ షో రూమ్ కి వెళ్ళాడు. కారు డెలివరీ తీసుకున్న వెంటనే మొదటి డ్రైవ్ శివాజీ చేశాడు. అనంతరం ఓపెన్ టాప్ నుండి శివాజీ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ పరిణామం కొందరికి కాలుతుంది అన్నాడు. సామాన్యుడు పైకి రావాలని అన్నాడు.
Pallavi Prashanth
పల్లవి ప్రశాంత్ కారు కొనడాన్ని ఎవరూ తప్పుబట్టడం లేదు. కానీ పేద రైతులకు ప్రైజ్ మనీ పంచకుండా లగ్జరీలు ఎంజాయ్ చేయడమే జనాలకు నచ్చడం లేదు. రూ. 35 లక్షలు ప్రైజ్ మనీగా తీసుకున్న పల్లవి ప్రశాంత్ కేవలం రూ. 1 లక్ష మాత్రమే పంచాడు. ఆ సాయం చేసి నెలలు గడుస్తున్నా మరొక సాయం చేయలేదు.
Pallavi Prashanth
సామాన్యుడిగా టైటిల్ గెలిచి పల్లవి ప్రశాంత్ చేసే పనులు ఓటు వేసిన వాళ్లకు నచ్చడం లేదు. శివాజీ అతన్ని ప్రోత్సహిస్తున్నారు. డబ్బులు పంచే విషయాన్ని మాత్రం విస్మరిస్తున్నాడు. మరి భవిష్యత్ లో అయినా పల్లవి ప్రశాంత్ ప్రైజ్ మనీ పంచుతాడో లేదో చూడాలి..