వైరల్: `బిగ్ బాస్ 4` కంటెస్టెంట్లలో మరో ముగ్గురికి కరోనా..?
బిగ్ బాస్ 4 షో కోసం క్వారెంటైన్లో ఉన్న వారికి పాజిటివ్ వస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా టెస్ట్ చేసి క్వారెంటైన్కు తరలించినా ఇంన్క్యూబేషన్ పిరీయడ్లో ఉన్నవారికి ఇప్పుడు పాజిటివ్ అని వస్తుందన్న టాక్ వినిపిస్తోంది.
టాలీవుడ్లో బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ షోకు మరోసారి రంగం సిద్ధమవుతోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 సెప్టెంబర్ 6న ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు కేవలం నాగర్జున హోస్ట్ అన్న విషయాన్ని మాత్రమే యూనిట్ సభ్యులు వెల్లడించారు. కంటెస్టెంట్లు ఎవరు, ఎంత మంది, షో ఎన్ని రోజులు జరగనుంది అన్న విషయాలను అధికారికంగా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ పై రకరకాల వార్తలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కంటెస్టెంట్లు వీళ్లే అంటూ చాలా రోజులుగా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఏ పేరు అధికారికంగా ప్రకటించలేదు. ముఖ్యంగా సింగర్ నోయల్, నందు, సునీత, యాంకర్ ఝాన్సీ, యూట్యూబర్స్ హారిక, మెహబూబ్, గంగవ్వ, జబర్థస్త్ ఫేం అవినాష్, కొరియోగ్రాఫర్ రఘు, జానీల పేర్లు ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ లిస్ట్లో బిగ్ బాస్ టీం కన్ఫార్మ్ చేయలేదు.
అయితే కరోనా నేపథ్యంలో నిర్వాహకులు ఇప్పటికే కంటెస్టెంట్లను ఫైనల్ చేసి వారిని క్వారెంటైన్లో ఉంచినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో క్వారెంటైన్లో ఉన్న వారికి పాజిటివ్ వస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా టెస్ట్ చేసి క్వారెంటైన్కు తరలించినా ఇంన్క్యూబేషన్ పిరీయడ్లో ఉన్నవారికి ఇప్పుడు పాజిటివ్ అని వస్తుందన్న టాక్ వినిపిస్తోంది.
ముందుగా సింగర్ నోయల్కు పాజిటివ్ వచ్చిందన్న వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తరువాత ఆ వార్తలను నోయల్ ఖండించాడు. కానీ బిగ్ బాస్లోకి తన ఎంట్రీ విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు నోయల్.
తాజాగా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వనున్న గంగవ్వకు కూడా కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. గంగవ్వతో పాటు మరొ ఇద్దరికి కూడా పాజిటివ్ వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో యూనిట్ వర్గాల్లో ఆందోళన నెలకొందన్న టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ వార్తలపై బిగ్ బాస్ టీం మాత్రం స్పందించలేదు. అయితే వరుసగా వస్తున్న ఈ వార్తలు వింటుంటే ఈ సారి బిగ్ బాస్ నిర్వహణ అంత ఈజీ కాదనిపిస్తోంది. ఎంతో మంది టీం పనిచేయాల్సిన పరిస్థితుల్లో వైరస్ భయం తీవ్ర స్థాయిలో ఉంటుందని భావిస్తున్నారు ప్రేక్షకులు.