భర్త కోహ్లీ ఆట చూస్తూ ఇబ్బంది పడ్డా అనుష్క శర్మ.. ఏం జరిగింది?
అబు దుబాయ్లో ఐపీఎల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. ఇందులో రాయల్ ఛాలెంజర్ బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీతోపాటు ఆయన భార్య, నటి అనుష్క శర్మ దుబాయ్కి వెళ్ళింది. ఓ వైపు మ్యాచ్, మరోవైపు వీరిద్దరి మధ్య రొమాన్స్ తో రక్తి కట్టిస్తున్నారు. కానీ తాజాగా విరాట్ ఆటని చూస్తూ అనుష్క చాలా ఇబ్బందికి గురయ్యింది.
సోమవారం జరిగిన మ్యాచ్ ఆర్సీబీ, ఢిల్లీల మధ్య జరిగింది. ఇందులో రాయల్ ఛాలెంజ్ బెంగుళూరు ఓటమి పాలయ్యింది. ఇందులో కోహ్లీ కేవలం 29 పరుగులే చేశారు.
అయితే కోహ్లీ నేతృత్వంలోని ఆర్సీబీ ఈ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ప్లేఆఫ్లో స్థానం సంపాందించింది. దీంతో కోహ్లీ కాస్త రిలాక్స్ అయ్యారు. వరుసగా నాలుగేళ్ల తర్వాత ఆర్సీబీ ప్లే ఆఫ్లోకి వెళ్ళడం విశేషం. ఇది కోహ్లీ భార్య అనుష్క శర్మకి కాస్త ఊరటనిచ్చింది. దీని వల్ల సెకండ్ ఎలిమినేటర్లో హైదరాబాద్, కోల్కతాలతో తలపడనుంది.
ఈ మ్యాచ్ జరిగే సమయంలో అనుష్క శర్మ కూడా పాల్గొనడం విశేషం. ఆమె స్టేడియంలో కూర్చుని మ్యాచ్ని తిలకించింది. తెల్లని దుస్తులు ధరించి అలరించింది అనుష్క. ఇందులో చాలా క్యూట్గా కనిపిస్తుంది.
ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఈ మ్యాచ్ తిలకించే సమయంలో అనుష్క చాలా ఇబ్బంది పడుతూ కనిపించింది. ఆమె మొహంలో ఆనందం కనిపించలేదు. విరాట్ ఆడే సమయంలో కూడా ఆమె అంతగా హ్యాపీగా కనిపించలేదు. పైగా అసౌకర్యవంతంగా ఫీలవుతూ కనిపించింది.
ఆమె ఇబ్బందికి ప్రెగ్నెన్సీనే కారణమని అర్థమవుతుంది. ప్రస్తుతం అనుష్క శర్మ గర్భవతిగా ఉన్నారు. జనవరిలో పండంటి బిడ్డకి జన్మనివ్వబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భర్తతో కలిసి దుబాయ్ వెళ్లింది అనుష్క.
సోమవారం మ్యాచ్లో ఆమె సీట్లో కూర్చిని చాలా ఇబ్బంది పడింది. తాను గర్భవతి కావడంతో ఎక్కువ సేపు అలా కూర్చోవడం చాలా పెయిన్గా ఉందని అర్థమవుతుంది. చాలా సందర్భాల్లో ఆమె తన కడుపుని అటూ, ఇటు తిప్పుతూ కనిపించింది. ఆ పెయిన్ నుంచి రిలీఫ్ పొందేందుకు అటూ ఇటు కదులుతూ కనిపించింది. ఎక్కువ సార్లు ఫోన్ చూస్తూ కనిపించారు. ఆమె మ్యాచ్ చూసే టైమ్లో బాగా అలసిపోయినట్టుగా ఉంది.
సాధారణంగా గర్భవతిగా ఉన్నప్పుడు వెయిట్ పెరుగుతారు. నెలలు నిండే కొద్ది తరచూ అలసి పోతుంటారు. ఈ నేపథ్యంలో అనుష్క శర్మ కూడా అలాంటి ఫీలింగ్నే అనుభవిస్తున్నట్టు తెలుస్తుంది. అనుష్క శర్మ మాదిరిగా, ఆర్సీబీ స్పిన్సర్ యుజ్వేంద్ర చాహల్ తనకు కాబోయే భార్య ధనశ్రీ వర్మని కూడా స్టేడియానికి తీసుకొచ్చారు. ఆమె తనకు కాబోయే భర్త యుజ్వేంద్రలో జోష్ నింపే ప్రయత్నం చేయడం విశేషం.