- Home
- Entertainment
- రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ లా మారిపోయిన అనసూయ.. దారుణమైన కెమెరా యాంగిల్ పెట్టి బోల్డ్ షో!
రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ లా మారిపోయిన అనసూయ.. దారుణమైన కెమెరా యాంగిల్ పెట్టి బోల్డ్ షో!
బోల్డ్ కెమెరా యాంగిల్స్ కి దర్శకుడు వర్మ ఫేమస్. తన హీరోయిన్స్ పరువాలను దారుణమైన కోణాల నుండి కవర్ చేసి చూపిస్తాడు. చూస్తే అనసూయ కూడా ఆయన పద్ధతి ఫాలో అవుతున్నట్లుంది.

Anasuya Bharadwaj
నటి అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటో షూట్ నెటిజెన్స్ మైండ్ బ్లాక్ చేసింది. సదరు ఫోటో షూట్ కి ఆమె వాడిన కెమెరా యాంగిల్స్ బోల్డ్ గా ఉన్నాయి. ఇది ప్రొఫెషనల్ ఫోటో షూట్ కాకున్నప్పటికీ కెమెరా క్రింద సెట్ చేసి ఊహించని విధంగా పరువాల ప్రదర్శన చేసింది.
Anasuya Bharadwaj
అనసూయ ఫోటోలు చూసిన జనాలు ఈమె వర్మ హీరోయిన్ లా మారిపోయిందన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు. అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. కాగా అనసూయ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేశారు. మొదట జబర్దస్త్ వదిలేసిన అనసూయ... మెల్లగా మిగతా షోస్ నుండి కూడా తప్పుకున్నారు. అనసూయ యాంకర్ గా ఒక్క ప్రోగ్రాం టెలికాస్ట్ కావడం లేదు. బుల్లితెర ఆడియన్స్ ఆమెను మిస్ అవుతున్నారు.
Anasuya Bharadwaj
ప్రస్తుతం అనసూయ ఫోకస్ మొత్తం యాక్టింగ్ పైనే పెట్టింది. నటిగా ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. గత ఏడాది అనసూయ తమిళ, మలయాళ చిత్రాలు కూడా చేశారు. అనసూయ ఒక్కో కాల్షీట్ కి మూడు లక్షల రూపాయలకు పైనే తీసుకుంటున్నారట. జబర్దస్త్ యాంకర్ గా నాలుగు వారాలు పని చేస్తే ఇచ్చేది కూడా ఇంతే.
Anasuya Bharadwaj
యాంకర్ గా వచ్చే ఆదాయంతో పోల్చితే నటిగా పెద్ద మొత్తం రాబట్టవచ్చు. అనసూయ నిర్ణయానికి ఇది కూడా కారణం. ఒక షోకి యాంకర్ గా నెలకి సంపాదించే డబ్బులు నటిగా ఒక్క రోజులో సంపాదించవచ్చు. ఇక హీరోయిన్ గా సక్సెస్ అయితే ఒక్కో సినిమాకు కోట్లు అందుకోవచ్చు. అలాగే బుల్లితెర షోల పట్ల ఆమె తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. టీఆర్పీ కోసం మేకర్స్ చెత్త పనులు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.
Anasuya Bharadwaj
ఇటీవల విడుదలైన మైఖేల్ చిత్రంలో అనసూయ కీలక రోల్ చేశారు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన మైఖేల్ పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో విడుదలైంది. ఇక పుష్ప 2లో మరోసారి ఆమె దాక్షాయణిగా కనిపించనున్నారు. ఇటీవల పుష్ప 2 సెట్స్ పైకి వెళ్ళింది. దర్శకుడు సుకుమార్ త్వరితగతిన ఈ క్రేజీ సీక్వెల్ షూట్ పూర్తి చేయనున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2పై భారీ అంచనాలు ఉన్నాయి.
Anasuya Bharadwaj
పుష్ప 2తో పాటు రంగమార్తాండ చిత్రంలో అనసూయ నటిస్తున్నారు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో అనసూయ కీలక రోల్ చేశారు. రంగమార్తాండ విడుదలకు సిద్ధమైంది. అనసూయ ప్రకాష్ రాజ్ కూతురు పాత్ర చేస్తున్నారని సమాచారం. ఆమె ప్రెగ్నెంట్ ఉమన్ గా కనిపిస్తారట.