దాని నుంచి బయటపడలేకున్నా, ఎఫెక్ట్ ఇంకా తగ్గలేదు.. హీరోపై అనసూయ కామెంట్స్ వైరల్
బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో అనసూయ దూసుకుపోతోంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు.
బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో అనసూయ దూసుకుపోతోంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది. మంచి కథలతో సినిమాలు రిలీజైనప్పుడు ఆ విశేషాలని అనసూయ అభిమానులతో పంచుకుంటోంది.
పుష్ప చిత్రంలో సునీల్ భార్య గా అనసూయ డీగ్లామర్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. పుష్ప 2 లో అనసూయ పాత్ర షాకింగ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు రంగస్థలం చిత్రంలో అనసూయ చేసిన రంగమ్మత్త పాత్ర కూడా ఇంకా ప్రేక్షకుల మదిలో నుంచి పోవడం లేదు. అంత అద్భుతంగా అనసూయ నటించింది.
అయితే అనసూయ మదిలో నుంచి ఒక చిత్రం పోవడం లేదట. ఆయా చిత్ర ప్రభావం, ఆ హీరో నటన వెంటాడుతూనే ఉన్నాయి అని అనసూయ అంటోంది. ఆ చిత్రం మరేదో కాదు.. లేటెస్ట్ సెన్సేషన్ కాంతారా. ఈ చిత్ర విశేషాలని అనసూయ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. కాంతారా హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి పై అనసూయ ప్రశంసలు కురిపిస్తోంది.
kantara
'రిషబ్ శెట్టి సర్ గురించి చెప్పాలంటే ఆయన అన్ బిలీవబుల్. కాంతారాలో ఆయన ఇంటెన్స్ పెర్ఫామెన్స్ నన్ను ఇప్పటికి వెంటాడుతూనే ఉంది' అని పేర్కొంది. చాలా మంది సెలెబ్రిటీలు ఇప్పటికే కాంతారా చిత్రంపై, రిషబ్ శెట్టిపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవల్ కి తీసుకువెళ్లాయి.
దేవుడి గెటప్ లో వచ్చే శబ్దం థియేటర్ నుంచి బయటకి వచ్చిన తర్వాత కూడా వెంటాడుతోంది అని చాలా మంది తెలిపారు. రిషబ్ శెట్టి క్లైమాక్స్ లో విభిన్నమైన శబ్దాలు చేస్తూ నట విశ్వరూపం ప్రదర్శించాడు. అదే ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది.
కేవలం 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచి దాదాపు 350 కోట్లు రాబట్టింది. ఊహకి అందని విజయంతో రిషబ్ శెట్టి క్రేజీ స్టార్ గా మారారు. సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం ఈ చిత్రాన్ని ప్రశంసించిన సంగతి తెలిసిందే.