పల్నాడు గడ్డని ఊపేసిన అనసూయ.. పిడుగురాళ్లలో అందాల వెల్లువ చూశారా, మైండ్ బ్లోయింగ్
టాలీవుడ్ క్రేజీ యాంకర్, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెరపై వెలుగు వెలిగిన అనసూయ ఇప్పుడు నటిగా విలక్షణ పాత్రలు చేస్తోంది.
టాలీవుడ్ క్రేజీ యాంకర్, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెరపై వెలుగు వెలిగిన అనసూయ ఇప్పుడు నటిగా విలక్షణ పాత్రలు చేస్తోంది. అనసూయ వెండితెరపై గ్లామర్ పాత్రలు చేయనప్పటికీ నటనతో అందరిని మెప్పిస్తోంది.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hkerfma1qpw9b1xw93ndbvyn/8-jpg_300x533xt.jpg)
గతంలో అనసూయ జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. అయితే అనూహ్యంగా అనసూయ టెలివిజన్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే తన అందాలతో యువతని ఉక్కిరి బిక్కిరి చేసేందుకు అనసూయ సోషల్ మీడియాని ఎంచుకుంది. ఇంస్టాగ్రామ్ లో అనసూయ ఇచ్చే ఫోజులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇక రంగస్థలం, పుష్ప, క్షణం లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా పెదకాపు చిత్రంలో నటిచింది. ఇప్పుడు పుష్ప 2, మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది.
పుష్ప చిత్రంలో దాక్షాయణి గా అనసూయ డీ గ్లామర్ రోల్ లో మెప్పించింది. పుష్ప మొదటి భాగం ఆమె పాత్రకి శాంపిల్ మాత్రమే. అనసూయ అసలైన విశ్వరూపం పుష్ప పార్ట్ 2లో ఉండబోతోంది.
అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ పిక్స్ ని షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం. అనసూయ చీర కడితే అచ్చతెలుగు వనితలాగా మెరుపులు మెరవాల్సిందే. మోడ్రన్ డ్రెస్సుల్లో సైతం ఉడికించడం అనసూయకి అలవాటే.
అయితే సెలెబ్రిటీలు అందంగా కనిపించడంలో వాళ్ళ మేకప్ ఆర్టిస్టుల శ్రమ ఎంతైనా ఉంటుంది. మేకప్ ఆర్టిస్టులకి సైతం క్రెడిట్ ఇచ్చే సెలెబ్రిటీలు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో అనసూయ ఒకరు అని చెప్పొచ్చు.
తాజాగా అనసూయ పల్నాడు గడ్డపై మెరిసింది. ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అనసూయ సందడి చేసింది. అనసూయ ఇటీవల తెలుగురాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలని చుట్టేస్తున్న సంగతి తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లో నలువైపులా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి ఆమెని ఆహ్వానిస్తున్నారు. భారీ రెమ్యునరేషన్ ఇచ్చి అనసూయ చేత మాత్రమే షాపింగ్ మాల్స్ ఓపెన్ చేయిస్తున్నారు.
పిడుగురాళ్లలో అనసూయ జివి మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొంది. దీనితో ఆ ప్రాంతమంతా అనసూయని చూసేందుకు జనసందోహంగా మారింది. పింక్ కలర్ శారీలో ఈ ఈవెంట్ కి హాజరైన ఆనసూయ తన సెక్సీ ఫోజులని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
వివిధ యాంగిల్స్ లో అనసూయ తన అందాలు ఒలకబోస్తూ ఎద సొగసుతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఫోజులు మైమరపించేలా ఉన్నాయి. అనసూయ గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు.