Allu Sneha Reddy : ఫస్ట్ టైమ్ యాడ్ లో నటించిన అల్లు అర్జున్ భార్య.. ఫ్యాన్స్ చెప్పినట్టు చేసి ఉంటేనా!
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ Allu Arjun భార్య ఫస్ట్ టైం ఒక యాడ్ షూట్ లో నటించింది. ఓ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ కెమెరా ముందు యాక్ట్ చేశారు. ప్రస్తుతం ఆ యాడ్ కు సంబంధించిన వీడియో విడుదలైంది.
స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి Allu Sneha Reddy సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. బన్నీ గురించి, తమ ఫ్యామిలీ గురించి ఎప్పటికప్పుడు అభిమానులకు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hkwa5fczjp080zwbpbdcdyn5/allu-sneha-reddy--6--jpg_300x290xt.jpg)
ఈ క్రమంలో నెట్టింట చాలా యాక్టివ్ గా ఉంటారు స్నేహారెడ్డి. ఫొటోషూట్లు, పలు ప్రమోషనల్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా లేటెస్ట్ అవుట్ ఫిట్లలో హీరోయిన్లకే జలసీ పుట్టేలా ఫొటోషూట్లు చేస్తుంటారు.
ప్రతి విషయాన్ని బన్నీ అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా తను ఫస్ట్ టైమ్ నటించిన యాడ్ షూట్ గురించి చెప్పుకొచ్చారు. ఆ వీడియోను కూడా అభిమానులతో పంచుకున్నారు.
కిండర్ బ్రాండ్ కు సంబంధించిన కిండర్ ఎస్ చోకో బోన్ క్రిస్పీ ప్రాడక్ట్ ను ప్రమోట్ చేస్తూ యాడ్ షూట్ చేశారు. ఇందులో చాలా నేచురల్ గా కనిపించారు. యాడ్ కు కావాల్సిన విధంగా కెమెరా ముందు నటించారు.
అల్లు అర్జున్ భార్య ఇలా యాడ్ షూట్ లో నటించడంతో బన్నీ అభిమానులు ఖుషీ అవుతున్నారు. మా వదిన, మా అక్క హీరోయిన్ మెటీరియల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కెమెరా ముందు బాగున్నారన్నారు.
అయితే, ఈ యాడ్ లో అల్లు స్నేహతో పాటు మరో అబ్బాయి నటించారు. ఆ పిల్లాడికి బదులుగా అల్లు అయాన్ బాబును పెట్టాల్సిందంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తల్లికొడుకు ఇద్దరు గనుగ యాడ్ లో నటించి ఉంటే బ్రాండ్ క్రేజ్ మరింత పెరిగిపోయేదంటున్నారు. మొత్తానికి ఈ యాడ్ షూట్ నెట్టింట వైరల్ గా మారింది.