Aishwarya Rajesh : కాశ్మీర్ అందాలను చూస్తూ ఆనందిస్తున్న ఐశ్వర్య రాజేష్..
కాశ్మీర్ టూర్ లో ఉన్న ఐశ్వర్య రాజేష్ తెగ ఎంజాయ్ చేస్తోంది. మంచు కొండల అందాలను ఆస్వాదిస్తూ తరించిపోతోంది. తను ఆనందించడమే కాకుండా అక్కడి విజువల్స్ ను, స్నో ఫాల్ ను తన సోషల్ మీడియాలో ఫొటోల్స్, వీడియాలో రూపంలో షేర్ చేస్తోంది. తాజాగా మరిన్ని ఫొటోలను పోస్ట్ చేసింది ఐశ్వర్య రాజేష్.
ఇటీవల కాశ్మీర్ టూర్ కు వెళ్లిన ఐశ్వర్య రాజేష్ నేచర్ ను ఎంజాయ్ చేస్తోంది. తన రిలేటీవ్స్, ఫ్రెండ్స్ తో కలిసి టూర్ కు వెళ్లి, కాశ్మీర్ మంచును, అక్కడి వాతావరణాన్ని అనుభూతి చెందుతోంది. ఎప్పకప్పుడు అక్కడ తాను చూస్తున్న ప్రదేశాలను, నేచర్ బ్యూటీ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూనే ఉంది.
ఈసారి అప్ లోడ్ చేసిన ఫొటోల్లో మాత్రం ఐశ్వర్య కంప్లీట్ నేచర్ ఫీల్ తో కనిపిస్తోంది. ఫుల్ ఖుషీగా కనిపిస్తోంది. ఎంతైనా ప్రక్రుతికి దగ్గరగా ఉంటే వచ్చే ఆనందమే వేరు. మైండ్ లో ఉన్న ఒత్తిడి, టెన్షన్ కు విరుగుడు నేచర్ అని చెప్పొచ్చు. అందుకే పలు టూర్లలో పొందే ఆనందం, ఎజాయ్ నెస్ ఎక్కడా దొరకదు. ఐశ్వర్య రాజేష్ కూడా తను కాశ్మీర్ కు వచ్చినప్పుడు కంటే ప్రస్తుతం తన ఫేస్ లో బ్యూటీనెస్, పీస్ కనిపిస్తున్నాయి.
తాజాగా ఐశ్వర్య పోస్ట్ చేసిన ఫోటోలు కాశ్మీర్ అందాలను ఎక్కువగా చూపించాయి. కాశ్మీర్ మంచు కొండల్లో పూసిన గులాబీలాగా ఐశ్వర్య కనిపిస్తోంది. రెడ్ కలర్ లాంగ్ స్వెటర్ వేసుకొని న్యాచురల్ స్టిల్స్ తో ఆకట్టుకుంటోంది ఐశ్వర్య. ఫొటోలను షేర్ చేస్తూ ‘ఆనందం’ క్యాప్షన్ కూడా పెట్టింది.
ఈ క్యాప్షన్ తో అర్థమౌతోంది ఐశ్వర్య కాశ్మీర్ టూర్ ను ఎంత సంతోషంగా గడిపిందో.. నిన్న తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసిన వీడియోలో ఐశ్వర్య స్నో ఫాల్ ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. మంచును గాల్లోకి ఎగరవేస్తూ ఖుషీ చేశారు. మంచుపై డ్యాన్స్ చేస్తూ సరదాగా గడిపారు.
తనకు కాశ్మీర్ లో సహకరించిన టూర్ అండ్ ట్రావెల్స్ కు చివరిగా ధన్యవాదాలు తెలిపింది. వారి గైడెన్స్ లో కాశ్మీర్ లో సమయమే తెలియలేదంటూ పేర్కొంది. ఈ మేరకు టూర్స్ అండ్ ట్రావెలర్స్ టీం మెంబర్ తో దిగిన ఫొటోను కూడా తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో టూర్ ముగిసినట్టేనని పలువురు అభిమానులు అనుకుంటున్నారు. లేదా ఇంకేదైనా టూరిస్ట్ ప్లేస్ కు వెళ్లనున్నారా అన్నది చూడాలి.
కాగా, ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే, ఏ జానర్ చిత్రానికైనా శక్తివంచన లేకుండా కష్టపడే హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ `కౌసల్య కృష్ణమూర్తి`, `వరల్డ్ ఫేమస్ లవర్` తెలుగు ప్రేక్షకులకు దగ్గరవగా.. ‘టక్ జగదీష్’, రిపబ్లిక్ లో కనిపించి మరింత చేరువైంది. అప్పటి నుంచి పలు భాషల్లో వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. త్వరలో పవన్ కళ్యాణ్- రానా హీరోలుగా నటిస్తున్న `భీమ్లా నాయక్` చిత్రంలో హీరోయిన్గా, రానా సరసన నటిస్తుంది.