- Home
- Entertainment
- Aishwarya Lekshmi: ఎంబీబీఎస్ చదివా, కానీ డాక్టర్ని కాలేదు.. ఐశ్వర్య లక్ష్మి కామెంట్స్
Aishwarya Lekshmi: ఎంబీబీఎస్ చదివా, కానీ డాక్టర్ని కాలేదు.. ఐశ్వర్య లక్ష్మి కామెంట్స్
ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ అయినా, అనుకోకుండా నటనలోకి రావడం వల్ల రోగులకు చికిత్స చేసే అవకాశం తనకు రాలేదని నటి ఐశ్వర్య లక్ష్మి తన మనసులోని మాటను బయటపెట్టారు.
14

Image Credit : Asianet News
సోషల్ మీడియాకు దూరం
ఐశ్వర్య లక్ష్మి 2017లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘మాయానది’, ‘వరతన్’ చిత్రాలతో మలయాళ ప్రేక్షకులను మెప్పించారు. తమిళం, తెలుగులోనూ మంచి పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని చెప్పిన ఐశ్వర్య, ప్రస్తుతం సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉండటం లేదు.
గూగుల్లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
24
Image Credit : our own
నాకు ఆ ఛాన్స్ రాలేదు
ఐశ్వర్య లక్ష్మి ఇప్పుడు తన ఎంబీబీఎస్ చదువు గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎంబీబీఎస్ చదివినా, ఇప్పటివరకు ఎవరికీ చికిత్స చేసే అవకాశం రాలేదని ఆమె చెప్పారు. 'నేనొక డాక్టర్ని. నా ఎంబీబీఎస్ చదువు పూర్తి చేశాను. కానీ, ఆ తర్వాత జనాలకు ట్రీట్మెంట్ ఇచ్చే ఛాన్స్ నాకు రాలేదు. చాలా కష్టపడి చదివి పాస్ అయ్యాను' అని తెలిపారు.
34
Image Credit : our own
డాక్టర్ అవ్వడం సులభం కాదు
'నాకు డాక్టర్గా ఉండటం చాలా ఇష్టం. కానీ, చాలా అనుకోకుండా నటిని అయిపోయాను. అదంతా దేవుడి ప్లాన్. డాక్టర్ అవ్వడం సులభం కాదు, దానికి కనీసం 8 ఏళ్లు పడుతుంది' అని ఐశ్వర్య లక్ష్మి చెప్పారు.
44
Image Credit : instagram
ఐదు భాషల్లో నిర్మిస్తున్నారు
ఐశ్వర్య నటించిన చివరి థియేటర్ రిలీజ్ 'గట్ట కుస్తీ'. ప్రస్తుతం, జోజు జార్జ్, ఊర్వశి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'ఆశా' ఐశ్వర్య కొత్త సినిమా. ఐదు భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు సఫర్ సనల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే చాలా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
Latest Videos

