మహిళలపై అనసూయ అదిరిపోయే పోస్ట్.. తమని సరిగ్గా ట్రీట్ చేస్తే ఏం జరుగుతుందో చెప్పిన మాజీ యాంకర్..
అనసూయ ఒకప్పుడు గ్లామర్ ఫోటో షూట్లతో వార్తల్లో నిలిచేది. `జబర్దస్త్` యాంకర్గా ఆమె చేసే రచ్చతో నెట్టింట హాట్ టాపిక్ అయ్యేది. చాలా రేర్ గా కాంట్రవర్సీలతో వైరల్ గా మారేది. కానీ ఇప్పుడు తరచూ ఆమె హాట్ టాపిక్ అవుతుంది.
Anasuya Bharadwaj
అనసూయ యాంకర్గానే పాపులర్ అయ్యింది. `జబర్దస్త్` కి యాంకరింగ్ చేసిన తర్వాత మంచి గుర్తింపు పేరు, క్రేజ్, ఇమేజ్ వచ్చింది. బుల్లితెరపై ఈ బ్యూటీకి అందాలకు ఫుల్ డిమాండ్, క్రేజ్ ఉండేది. దీనికి తోడు అడపాదడపా సినిమాలు చేస్తూ వెండితెరపై మెరుస్తుంది. కానీ `రంగస్థలం` చిత్రం తర్వాత అనసూయ లెక్క మారిపోయింది. ఆమె రంగమ్మత్తగా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆ తర్వాత భారీ సినిమాల్లోనూ ఆఫర్లు వస్తున్నాయి. నెగటివ్ రోల్స్, ఐటెమ్ సాంగ్లు, బోల్డ్ రోల్స్ సైతం ఆమెకి ఆఫర్ చేస్తున్నారు. దీంతో నటిగా బిజీ అయ్యింది.
ఓ వైపు సినిమా అవకాశాల జోరు పెరిగింది. వరుసగా సినిమాలు చేస్తుంది. తెలుగులోనే కాదు, తమిళం, మలయాళంలోనూ ఆఫర్లు వస్తున్నాయి. దీంతో నటిగా అనసూయ రేంజ్ మారిపోయింది. దీని కారణంగా ఆమె `జబర్దస్త్` షోకి గుడ్ బై చెప్పింది. మరోవైపు జబర్దస్త్ కామెడీ షోలో ఆమెపై కమెడియన్లు పలు డబుల్ మీనింగ్ డైలాగులు కొడుతుంటారు. అందంపై కూడా కామెంట్లు చేస్తుంటారు. ఈ విషయంలోనూ తాను హార్ట్ అయ్యిందట అనసూయ. బాడీ షేమింగ్ కామెంట్లు ఎక్కువవయ్యాయని, తప్పుకోవడానికి అది కూడా ఓ కారణమని చెప్పింది. కానీ దీనిపై విమర్శలు వచ్చాయి. ఇన్నాళ్లు లేని కామెంట్లు కొత్తగా ఇప్పుడు వచ్చాయా? అంటూ ప్రశ్నించిన వారు ఉన్నారు.
ఏదేమైనప్పటికీ తాను ఏం చేయాలనేది అనసూయ పర్సనల్. తన లైఫ్ తన ఇష్టం. కానీ సెలబ్రిటీ అన్నాక రకరకాల కామెంట్లు వస్తుంటాయి. వాటిని ఎలా తీసుకుంటారనేది ముఖ్యం. సీరియస్ గా తీసుకుంటే గొడవలైపోతాయి, లైట్ తీసుకుంటే ఓ గొడవ లేదు. కానీ అడపాదడపా అనసూయ స్పందిస్తుంటుంది. ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్లిస్తుంది. సోషల్ మీడియాలో తనపై వచ్చే కామెంట్లకి ఘాటుగా రియాక్ట్ అవుతుంటుంది. ఆ మధ్య కొందరిపై కేసు కూడా పెట్టిందీ ఈ అన్నుబేబీ.
Anasuya Bharadwaj
మరోవైపు సామాజిక అంశాలు, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అంశాలపై కూడా స్పందిస్తుంటుంది అనసూయ. మహిళలను తక్కువ చేసిన చూసినా, తక్కువ చేసి మాట్లాడినా సహించదు. ఎదుటి వాళ్లు ఎంతటి వారనేది కూడా చూడదు. విజయ్ దేవరకొండతో వివాదం దానివల్లే వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల కూడా పరోక్షంగా దీనిపై ఆమె స్పందించింది. మహిళా సాధికారతకు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే అనసూయ.. మహిళలపై ఆసక్తికర పోస్ట్ పెట్టింది.
మహిళలను సరైన విధంగా ట్రీట్ చేస్తే వారు గొప్ప స్థాయికి ఎదుగుతారని, ప్రకాశిస్తారని తెలిపింది. `మహిళలు సరైన విధంగా ఉన్నప్పుడు, వారిని సరిగ్గా ట్రీట్ చేసినప్పుడు వారు భిన్నంగా ప్రకాశిస్తారు` అని పేర్కొన్నారు. మహిళలకు రెస్పెక్ట్ కోరుకుంటుంది అనసూయ. వారిని ఎంకరేజ్ చేయాలని, వారిని పాజిటివ్ యాంగిల్లో చూడాలని, ఆ దిశగా ఎంకరేజ్ చేస్తే అద్భుతాలు చేస్తారనేది అనసూయ ఇన్నర్ ఫీలింగ్గా ఈ పోస్ట్ ద్వారా తెలుస్తుంది. చాలా కాంట్రవర్సీలు, చాలా ట్రోల్స్ అనంతరం అనసూయ పెట్టిన ఈ పోస్ట్ అందరిని సర్ప్రైజ్ చేస్తుంది. పాజిటివ్గా మార్చేసింది. ఇన్ స్టా స్టోరీస్లో పెట్టిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
ఇక నటిగా ప్రస్తుతం అనసూయ.. `పుష్ప2`లో నటిస్తుంది. ఇందులో దాక్షాయణి అనే నెగటివ్ రోల్ చేస్తుంది. మరోవైపు `సింబా`తోపాటు నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంది. ఇంకోవైపు తమిళంలో ప్రభుదేవతో ఓ సినిమా చేస్తుంది. నెగటివ్ రోల్ కూడా చేస్తుంది. అవసరమైతే బోల్డ్ రోల్స్ కూడా చేస్తుంది. ఇటీవల `విమానం` చిత్రంలో వేశ్యగా నటించిన విషయం తెలిసిందే. తమిళ చిత్రంలోనూ వేశ్యగా నటిస్తుంది.