మిస్యూ నాన్న.. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాః కదిలిస్తున్న సురేఖా వాణి కూతురు ఎమోషనల్ పోస్ట్
సోషల్ మీడియాలో నిత్యం చర్చనీయాంశంగా మారుతున్న నటి సురేఖా వాణి కూతురు సుప్రిత భావోద్వేగానికి అయ్యింది. తన నాన్నని గుర్తు చేసుకుంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అదిప్పుడు అందరిని కదిలిస్తుంది.
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్గుగా గుర్తింపు పొందింది సురేఖా వాణి. ఆమె భర్త సురేష్ తేజ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూశారు. నేడు(మే6) ఆయన వర్థంతి. ఈ సందర్భంగా తండ్రిని గుర్తు చేసుకుని సుప్రిత ఎమోషనల్ అయ్యింది. ఓ భావోద్వేగభరితమైన పోస్ట్ ని ఇన్స్టా స్టోరీస్లో పంచుకుంది.
`కొన్ని సార్లు మనకు తెలుసు వాళ్లని చూడలేమని, వాళ్ల నుంచి మనకు ఎలాంటి కాల్ రాదని. కానీ ఆ ప్రేమ ఎప్పటికి ఉంటుంది. నాన్న నిన్ను మిస్ అవుతున్నా. నా జీవితంలో ఇదొక వరస్ట్ డే. నువ్వు ఇప్పటికీ మా చుట్టునే ఉన్నావని భావిస్తున్నా. కానీ అప్పుడే నువ్వు మమల్ని వదిలి రెండేళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నా. ఐ మిస్ యూ నాన్న. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా` అంటూ ఎమోషనల్ అయ్యింది సుప్రిత.
ఈ పోస్ట్ వైరల్గా మారింది. ఆమె ఫ్రెండ్స్ , నెటిజన్లని ఈ పోస్ట్ కదిలిస్తుంది. ధైర్యంగా ఉండండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల `అలీతో సరదాగా` షోలో తన భర్తని గుర్తు చేసుకుని సురేఖా వాణి కూడా కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తనయ సుప్రిత సైతం ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
ఇక ఇటు సురేఖా వాణి, అటు సుప్రిత సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ని మెయింటేన్ చేస్తున్నారు. వీరి ఫోటోలకు డిమాండ్ ఎక్కువ. వాటిని వైరల్ చేస్తూ సందడి చేస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే సురేఖా వాణి పొట్టి డ్రెస్సులో కూతురుకే పోటీ ఇస్తుంది.
ఇటీవల సురేఖా వాణి తన 40వ బర్త్ డే జరుపుకుంది. దాన్ని తనయ సుప్రితనే ప్రత్యేకంగా ఫ్రెండ్స్ తో కలిసి అరేంజ్ చేయించడం విశేషం. ఈ సందర్భంగా సురేఖా తన సంతోషాన్ని పంచుకుంది. సురేఖా, సురేష్ తేజలకు ఒకే కూతురు సుప్రిత ఉన్నారు.
సురేఖా వాణి కూతురు హీరోయిన్లకి తగ్గ అందం ఆమె సొంతం. త్వరలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుందనే ప్రచారం కూడా జరుగుతుంది.