ఎన్టీఆర్ వివాదం ముగియక ముందే మరో రచ్చ.. సుశాంత్ సింగ్ ఎవరన్న మీరా
ఇటీవల హీరోయిన్ మీరా చోప్రా, ఎన్టీఆర్ అభిమానుల మధ్య భారీ స్థాయిలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వివాదం గురించి మర్చిపోకముందే మరోసారి సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఫ్యాన్స్తో పెట్టుకుంది మీరా చోప్రా.
గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ ఎవరో నాకు తెలియదన్న మీరా చోప్రా అభిమానుల ఆగ్రహానికి గురైంది. సోషల్ మీడియా వేదిక మీరా చోప్రాను విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే ఆ ట్రోల్స్ కాస్త శృతిమించటంతో ఆమె పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.
తన మీద వస్తున్న ట్రోల్స్ను సోషల్ మీడియాలో షేర్ చేసిన మీరా.. కేటీఆర్ ట్యాగ్ చేయటంతో ఆయన స్పందించారు. తెలంగాణ పోలీసులను చర్యలు తీసుకోవాలని సూచించారు, ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దాదాపు 15 మందిపై చర్యలకు సిద్ధమవుతున్నారు.
అయితే ఈ వివాదం ఇంకా మర్చిపోక ముందే మరోసారి తప్పులో కాలేసింది మీరా చోప్రా. సుశాంత్ సింగ్ చనిపోయాడంటూ ఓ నెటిజెన్ మీరా చోప్రాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ పై స్పందించిన మీరా ఎవరతను అంటూ కామెంట్ చేసింది.
యావత్ దేశం ఓ యువ నటుడి మరణ వార్తతో దుఖంలో ఉన్న సమయంలో మీరా చేసిన ఆ ట్వీట్ విమర్శలకు కారణమైంది. ఇది అదునుగా మరోసారి రెచ్చిపోయారు ట్రోలర్స్. మీరా ను టార్గెట్ చేస్తూ ఓ రేంజ్లో ట్వీట్లు చేశారు. తరువాత తేరుకున్న మీరా.. సుశాంత్ అంటే బాలీవుడ్ నటుడని నేను భావించలేదని, అతను అలాంటి పని చేస్తాడని ఎవరు అనుకుంటారు అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.
ఆ తరువాత సుశాంత్ మృతిపై స్పందిస్తూ ఓ సుధీర్ఘ లేకను పోస్ట్ చేసింది మీరా. ఈ లేఖలోనే సంచలన ఆరోపణలు చేసింది బతికుండగా సుశాంత్ను పట్టించుకోని వారు ఇప్పుడు రిప్ మెసేజ్లు పెడుతున్నారంది. అలాంటి బాలీవుడ్ ఇండస్ట్రీ తరుపును తాను సుశాంత్కు క్షమాపణలు చెబుతున్నా అంటూ కామెంట్ చేసింది మీరా.