20 మందికి కరోనా, షూటింగ్ ఆపేసిన మహేష్?!
కరోనా టైమ్ లో చాలా మంది ధైర్యం చేసి షూటింగ్ లు మొదలెడుతున్నారు. స్టార్స్ కొద్దిగా వెనకడుగు వేస్తున్నారు. అదే పద్దతిలో అడివి శేష్ సైతం ‘మేజర్’ చిత్రం మొదలెట్టారు. ఈ సినిమాని మహేష్ బాబు ప్రొడక్షన్ హౌస్పై సోనీ పిక్చర్స్ భాగస్వామ్యంలో తెరకెక్కిస్తోన్నారు. మొదట్లో ఆగస్ట్ నాటికి విడుదల చేయాలని మేజర్ టీమ్ ప్లాన్ చేసుకుంటే కరోనా వచ్చి దెబ్బకొట్టింది.
అయితే సినిమా షూటింగ్స్ కు ప్రభుత్వం ఫర్మిషన్ ఇచ్చి , ఆంక్షలను ప్రభుత్వం ఎత్తి వేయడంతో మేజర్ షూటింగ్ తక్కువ మంది టీమ్ తో చేయడానికి రెడీ అయ్యారు.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01ef45t7pknbzdc0rhtqmnptkd/whatsapp-image-2020-08-07-at-2-48-03-pm-jpeg_300x169xt.jpg)
అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ, రకరకాలుగా హెల్త్ కాషన్ లతో సర్వ సన్నద్ధమయి కొన్ని రోజుల షూటింగ్ కూడా చేసారు. అయితే అనుకోని ట్విస్ట్ పడిందిట. టీమ్ కొందరిలో కరోనా లక్షణాలు కనపడ్డాయిట
దాంతో కొద్ది రోజుల షూటింగ్ తర్వాత ముందు జాగ్రత్త కోసమని కరోనా టెస్ట్ యూనిట్ అంతా చేయించుకోగా వారిలో సగం మందికి పాజిటివ్ వచ్చిందని సమాచారం.
దాదాపు ఇరవై మందికి కరోనా రావటంతో షాక్ అయ్యారట. ఈ విషయం తెలిసిన మహేష్ వెంటనే మరో మాట లేకుండా ...షూటింగ్ కన్నా ఆరోగ్యాలు ముఖ్యం...మొత్తం అందరినీ షూటింగ్ ఆపేసి క్వరంటైన్ కు వెళ్లమని సూచించారట
అంతేకాకుండా కరోనా లక్షణాలు కనపడ్డ వారికి ట్రీట్మెంట్ చేయించుకోమని వెంటనే ఆ ఏర్పాట్లు చేసారట. అప్పటినుంచి రోజు వారి..వారి ఆరోగ్యం ఎలా ఉందనేది ఎంక్వైరీ చేస్తున్నారట.
ఈ సంఘటన చూసాక మహేష్ ఎట్టిపరిస్దితుల్లోనూ షూటింగ్ ఇప్పుడిప్పుడే షూటింగ్ పెట్టుకోకూడదని ఫిక్స్ అయ్యారట. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేస్తున్నా కానీ కరోనా ఏదో ఒక రకంగా వచ్చేస్తూండటంతో సినిమా వాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.
ఇక క్షణం, అమీతుమీ, గూఢాచారి, తాజాగా “ఎవరు’ సినిమాతో హ్యాట్రిక్ కొట్టిన యంగ్ హీరో అడవి శేష్, మేజర్ మూవీతో త్వరలో మనని పలకరించటానికి రెడీ అవుతున్నాడు.
ఈ మూవీ కోసం అడవి శేష్ ఇప్పటికే తీవ్రంగా శ్రమిస్తున్నాడట. సినిమాలో తన మిలటరీ అధికారి క్యారెక్టర్ కావటంతో..నిజమైన సైనికుడిగా కనిపించేందుకు భారీగా వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నాడట. అందుకోసం స్ట్రిక్ట్ డైట్ ప్లాన్ చేసుకుని..ఖచ్చితంగా ఫాలో అవుతున్నాడట.
అశోక చక్ర అవార్డు పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తీస్తున్నారు ఈ సినిమాని. ఇలా తొలిసారిగా అడవి శేష్ బయోపిక్లో నటించనున్నాడు.
ఇలా షూటింగ్ మొదలైన కొద్ది రోజులకు కరోనా బయిటపడటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చాలా మంది షూటింగ్ లు మొదలెడదామనుకునే వాళ్లు మళ్లీ ఆలోచనలో పడేలా చేసింది.