టాలీవుడ్ బెస్ట్ కపుల్ సమంత-నాగచైతన్య వెడ్డింగ్ ఖర్చు ఎంతో తెలుసా?.. వింటే దిమ్మతిగిరిపోతుంది?
టాలీవుడ్లో మోస్ట్ క్రేజ్ కపుల్గా, ఆదర్శ జంటగా నిలుస్తుంది సమంత- నాగచైతన్య జోడి. చాలా గ్రాండియర్గా జరిగిన వీరి వెడ్డింగ్ కాస్ట్ తెలిస్తే మతిపోతుంది. లావిష్ వెడ్డింగ్ వెనకాల భారీగా ఖర్చు పెట్టారని, వింటే దిమ్మతిరిగిపోయవడం ఖాయమని చెప్పొచ్చు.
సమంత, నాగచైతన్య ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో బెస్ట్ కపుల్గా రాణిస్తున్నారు. మ్యారేజ్ తర్వాత నుంచి ఇప్పటి వరకు వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఎలాంటి క్లాషెస్ లేకుండా సాఫీగా సాగిపోతుందీ వీరి లైఫ్.
వీరిద్దరు సెలబ్రిటీసే కావడంతో అందరికంటే వీరి జోడీపై అందరి చూపు ఉంటుంది. ఎక్కువ ఫోకస్ కూడా ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తున్నారు చై-సామ్ జంట. ఓ వైపు ఫ్యామిలీ లైఫ్ని, మరోవైపు కెరీర్ని బ్యాలెన్స్ చేస్తూ రాణిస్తున్నారు.
అయితే తాజాగా వీరి మ్యారేజ్కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వీరి వెడ్డింగ్ ఖర్చు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. చై,సామ్ తమ మ్యారేజ్ కోసం భారీగానే ఖర్చు చేశారట. ఏకంగా పది కోట్లు వీరి మ్యారేజ్ ఖర్చు అయ్యిందనే వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
మ్యారేజ్ని అంతటి గ్రాండ్గా, లావిష్గా చేయడానికి అంత పెద్ద అమౌంట్ అయ్యిందని అంటున్నారు. అయితే వీరి మ్యారేజ్ రెండు సంప్రాదాయాల ప్రకారం జరగడం విశేషం.
మొదట అంటే అక్టోబర్ 6, 2017న హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది. పట్టు వస్త్రాలు, డిజైనింగ్ వేర్స్ తో ట్రెడిషనల్ లుక్ ఉట్టిపడేలా మ్యారేజ్ జరిగింది. ఆ తర్వాత అక్టోబర్ 7న చెన్నైలో క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం చర్చ్ లో రెండో సారి వివాహం జరిపించారు. సమంతది క్రిస్టియన్ ఫ్యామిలీ కావడంతో అలా చేశారు.
రెండు సార్లు మ్యారేజ్ అంటే ఆశామాషీ కాదు. అందుకు భారీగా ఖర్చు అవుతుంది. పైగా చాలా రాయల్ స్టయిల్లో, గ్రాండియర్గా జరుపుకున్నారు. దీంతో దాదాపు పది కోట్ల వరకు వీరి మ్యారేజ్కి ఖర్చు చేశారని తెలుస్తుంది.
వధువరుల డ్రెస్సెస్, భారీ డిజైనర్ వేర్స్, పట్టు వస్త్రాలు, బంధుమిత్రులకు పెట్టిపోతలు ఓ వైపు అయితే, పెళ్లి మండపాలు, దాని డెకరేషన్, స్పెషల్ డిజైనింగ్స్, లైవ్ వీడియో కెమెరా, ఫోటో షూట్, గెస్ట్లకు ఆహ్వానం, వెడ్డింగ్ కార్డ్, రిసెప్షన్, భోజనలు, పార్టీలు ఇలా అన్నీ కలిపి దాదాపు పది కోట్ల వరకు ఖర్చయిందని తెలుస్తుంది.
వందల కోట్ల ఆస్తులున్న నాగార్జున తన పెద్ద కుమారుడు నాగచైతన్య మ్యారేజ్ని తన రేంజ్ మేరకు గ్రాండ్గానే చేశాడు. లవ్ మ్యారేజ్ అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా చాలా లావిష్గా చేశారు. అందరిచేత వాహ్ అనిపించుకున్నారు. దీంతో ఇప్పుడిది డిస్కషన్గా మారింది.
`ఏ మాయ చేసావె` చిత్రంతో నాగచైతన్య, సమంత కలిశారు. ఆ సినిమా టైమ్లో ఏర్పడిన పరిచయం, క్రమంగా పెరుగుతూ ప్రేమగా మారింది. కొన్నాళ్లపాటు అనేక టర్న్ లు, ట్విస్ట్ లు చోటు చేసుకుని చివరికి పెళ్లి వరకు వచ్చింది.
వీరి లవ్కి నాగార్జున మొదట అంతగా ఆసక్తి చూపించలేదని, ఆయన ఇంట్రెస్ట్ గా లేడనే వార్తలొచ్చాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి నాగ్.. చైతూ, సమంతల ప్రేమని ఒప్పుకుని పెళ్లికి సిద్ధమయ్యారు. ఇండస్ట్రీకి ఒక బెస్ట్ కపుల్ని అందించారు.
సమంత, నాగచైతన్య కలిసి `ఏ మాయ చేశావె`తోపాటు `మనం`, `ఆటోనగర్ సూర్య`, `మజిలీ` చిత్రాల్లో నటించారు. పెళ్లి తర్వాత కలిసి నటించిన తొలి సినిమా `మజిలీ`.
ప్రస్తుతం నాగచైతన్య `లవ్ స్టోరి` చిత్రంలో నటించారు. ఇది విడుదలకు రెడీగా ఉంది. దీంతోపాటు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో `థ్యాంక్యూ` చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు సమంత తమిళంలో ఓ సినిమా, తెలుగులో `శాకుంతలం` సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది.