స్టేజ్ పై విజయశాంతితో చిరు రొమాన్స్... పులిహోర కలిపేశాడంటూ ట్రోల్స్!
లేడీ అమితాబ్ విజయశాంతి, మెగాస్టార్ చిరంజీవి కలిసి 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో వైభవంగా నిర్వహించిన ఈ ఈవెంట్ లో వీరిద్దరినీ ఒకే వేదికపై చూసే ఛాన్స్ కలిగింది.
లేడీ అమితాబ్ విజయశాంతి, మెగాస్టార్ చిరంజీవి కలిసి 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు.
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో వైభవంగా నిర్వహించిన ఈ ఈవెంట్ లో వీరిద్దరినీ ఒకే వేదికపై చూసే ఛాన్స్ కలిగింది.
ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ విజయశాంతితో తనకు ఎమోషనల్ రిలేషన్ ఉందని చెప్పారు. కుటుంబసభ్యుల్లా కలిసి ఉండేవారమని చెప్పారు.
ఇద్దరూ కలిసి 19-20 సినిమాలు చేశామని చెప్పుకొచ్చారు.
అంతేకాదు.. రాజకీయాల్లో విజయశాంతి తనను విమర్శించి చాలా మాటలు అందని.. అలా ఎందుకు అన్నావ్ అంటూ విజయశాంతిపై సరదాగా చిర్రుబుర్రులాడారు.
విజయశాంతి కూడా ఆయనకి తగ్గట్లుగా పంచ్ లు వేశారు.
ఈ షో చూసిన వారంతా చిరు, విజయశాంతిల రీయూనియన్ లా ఉందంటూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.
మహేష్ బాబు ఈవెంట్ అనే సంగతి మర్చిపోయి తమ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుకున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
దీనిపై రకరకాల మీమ్స్ ని తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ మీమ్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలను ఎక్కువగా ట్రోల్ చేస్తుండడం చూస్తూనే ఉన్నాం.
ఈ ట్రోలింగ్ కి ఈసారి చిరు, విజయశాంతిలు బలైపోయారు.
మరి ఈ ట్రోలింగ్ వారి దృష్టి వరకు వెళ్తుందో లేదో చూడాలి!