రూటు మార్చిన హీరోలు.. హిట్టు కొట్టేలా ఉన్నారు!
సినిమా ఇండస్ట్రీలో మినిమమ్ హిట్ అందుకోవాలంటే ఈ రోజుల్లో చాలా కష్టంగా మారింది. చేసిన సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు. ఇక ప్రస్తుతం సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల సంఖ్య పెద్దదిగానే ఉంది. రొటీన్ గా ట్రై చేయకుండా సక్సెస్ అందుకోవడానికి ప్రయోగాలు చేస్తున్నారు. అలాంటి హీరోలపై ఒక లుక్కేస్తే..
అక్కినేని అఖిల్: మొదటి సినిమా అఖిల్ నుంచి ఈ స్టార్ కిడ్ కోలుకోలేని పరిస్థితి. హలో - మిస్టర్ మజ్ను కూడా డిజాస్టర్ కావడంతో సక్సెస్ అతనికి అందనిద్రాక్షల మారింది. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సరికొత్త లవ్ యాంగిల్ తో ఎమోషనల్ కంటెంట్ ని ప్రజెంట్ చేయబోతున్నారట.
రవితేజ: రాజా ది గ్రేట్ అనంతర సక్సెస్ ట్రాక్ ఎక్కాడనుకున్న మాస్ రాజా మళ్ళీ నెల టిక్కెట్టు - టచ్ చేసి చూడు - అమర్ అక్బర్ ఆంటోని సినిమాలతో డిజాస్టర్ ఊబిలో ఇరుక్కుపోయాడు. ఇప్పుడు డిస్కో రాజా అనే సైన్స్ ఫిక్చన్ తో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని కష్టపడుతున్నాడు.
గోపీచంద్: మంచి మాస్ ఫాలోయిన్ సినిమాలతో ఒకప్పుడు తనకంటూ ఒక మార్కెట్ సెట్ చేసుకున్న గోపీచంద్ సక్సెస్ ని చూసి చాలా కాలమవుతోంది. ఆక్సిజన్ - గౌతమ్ నందా - పంతం సినిమాలు ఏవి కూడా మనోడికి సక్సెస్ ఇవ్వలేకపోయాయి. ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్ లో ఒక స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు.
మంచు మనోజ్: ఈ యువ హీరో ఎలాంటి ప్రయోగాలు చేసినా వర్కౌట్ అవ్వడం లేదు. కరెంట్ తీగ తరువాత చేసిన అయిదు సినిమాలు బిగ్ డిజాస్టర్స్ గా నిలిచాయి. ప్రస్తుతం ఒక సీరియస్ థ్రిల్లర్ జనార్ లో డిఫరెంట్ కథతో రెడీ అవుతున్నాడు.
శర్వానంద్: శతమానం భవతి - మహానుభావుడు సినిమాలతో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న శర్వా ఆ తరువాత చేసిన పడి పడి లేచే మనసు - రణరంగం సినిమాలు భారీ నష్టాలతో షాకిచ్చాయి. ప్రస్తుతం 96 రీమేక్ తో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నాడు.
రాజ్ తరుణ్: కెరీర్ మొదట్లో హ్యాట్రిక్ విజయాలతో అందరిని ఆకర్షించిన యువ హీరో తరుణ్ భాస్కర్ ఆ తరువాత వరుసగా 6 సినిమాలతో దెబ్బ తిన్నాడు. ప్రస్తుతం 'ఒరేయ్ బుజ్జిగా' అనే సినిమాతో బిజిగా ఉన్నాడు.
నితిన్: అఆ సినిమాతో తన మార్కెట్ ను పెంచుకున్న నితిన్ లై సినిమాతో ఊహించని డిజాస్టర్ అందుకున్నాడు. అనంతరం ఛల్ మోహన్ రంగ - శ్రీనివాస కళ్యాణం సినిమాలతో డిజాస్టర్స్ అందుకున్నాడు. ప్రస్తుతం రంగ్ దే - భీష్మా అనే డిఫరెంట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో చంద్ర శేఖర్ యేలేటి - కృష్ణ చైతన్య లతో కూడా వర్క్ చేయనున్నాడు.
అల్లరి నరేష్: సుడిగాడు సినిమా తరువాత పదికి పైగా సినిమాలు చేసిన నరేష్ మళ్ళీ ఆ స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. రీసెంట్ గా మహేష్ మహర్షి సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ చేసి పరవాలేధనిపించాడు. నెక్స్ట్ 'నాంది' అనే సినిమాతో సక్సెస్ కొట్టాలని ట్రై చేస్తున్నాడు. అలాగే సుడిగాడు సినిమాకు సీక్వెల్ చేసేందుకు కూడా నరేష్ ప్లాన్ చేస్తున్నాడు.
ఆది: ప్రేమ కావాలి - లవ్లీ సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకోని సెట్టయ్యాడనుకున్న ఆది సాయి కుమార్ ఆ తరువాత వరుసగా 8 సినిమాలతో దెబ్బ తిన్నాడు. ప్రస్తుతం ఈ హీరో కూడా థ్రిల్లర్ కథల కోసం వెతుకుతున్నాడు.
అల్లు శిరీష్: 5 సినిమాలతో ఆడియెన్స్ ని మెప్పించే ప్రయత్నం చేసిన అల్లు శిరీష్ శ్రీ రస్తు శుభమస్తు సినిమాతో మాత్రమే కాస్త పాజిటివ్ టాక్ ను అందుకున్నాడు. ఇక ఆ తరువాత చేసిన ఒక్క క్షణం - ఎబిసిడి సినిమాలు ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యాయి. ప్రస్తుతం శిరీష్ రాక్షసుడు డైరెక్టర్ రమేష్ వర్మతో కొత్త ప్రాజెక్ట్ ను సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు.