మహేష్ చేతుల మీదుగా విజయ్ దేవరకొండ సినిమా ట్రైలర్ లాంచ్(ఫొటోస్)
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. షమీర్ సుల్తాన్ దర్శకత్వంలో తరుణ్ భాస్కర్ హీరోగా నటించాడు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నేడు జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై మీకు మాత్రమే చెప్తా ట్రైలర్ లాంచ్ చేశాడు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ పుష్పగుచ్చంతో మహేష్ కు స్వాగతం పలికాడు.
విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్, హీరోయిన్ వాణి భోజన్, అనసూయ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మంచి ఫన్ ఎలిమెంట్స్ తో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా మీకు మాత్రమే చెప్తా చిత్రం తెరకెక్కింది.
నవంబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.
పెళ్లి చూపులు చిత్రంతో తరుణ్ భాస్కర్ విజయ్ దేవరకొండకు హిట్ ఇచ్చాడు.
ప్రస్తుతం అదే తరుణ్ భాస్కర్ విజయ్ దేవరకొండ నిర్మాణంలో హీరోగా నటిస్తుండడం ఆసక్తిని రేపుతోంది.
ట్రైలర్ లాంచ్ సందర్భంగా మహేష్ బాబు చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపాడు.
మహేష్ మహర్షి చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే.
కెరీర్ ఆరంభం నుంచి విజయ్ దేవరకొండ మహేష్ పట్ల అభిమానాన్ని చాటుకుంటున్నాడు.
మహేష్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేయించడం చిత్ర యూనిట్ కి కలసి వచ్చే అంశమే.