రజనీకాంత్ 'దర్బార్' కథ ఇదే?
ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న చిత్రం ఇదే అనే భావన దర్బార్ ట్రైలర్ తోనే కలిగించటం ప్లస్ అయ్యింది. ముంబై కమిషనర్ ఆదిత్య అరుణాచలం పాత్రలో రజినీ చెలరేగిపోయాడని ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ అంటూ ఒకటి ప్రచారంలోకి వచ్చింది.
సూపర్ స్టార్ రజినీకాంత్ దర్బార్ చిత్రం మరో 24 గంటల్లో మన ముందుకు రానున్న సంగతి తెలిసిందే. రజిని సినిమా అంటే ఉండే రచ్చే వేరు. అయితే గత కొన్ని చిత్రాలుగా రజినీ సినిమాలు వరసగా ఫ్లాఫ్ అయ్యి ఫ్యాన్స్ ని నిరుత్సాహపరుస్తున్నాయి. అభిమానులు కోరుకున్న పూర్తి అంశాలతో రజినీ సినిమా వచ్చి చాలా కాలమైంది. ఈ నేపథ్యంలో దర్బార్ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ బాగున్నాయి. ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న చిత్రం ఇదే అనే భావన దర్బార్ ట్రైలర్ తోనే కలిగించటం ప్లస్ అయ్యింది. ముంబై కమిషనర్ ఆదిత్య అరుణాచలం పాత్రలో రజినీ చెలరేగిపోయాడని ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ అంటూ ఒకటి ప్రచారంలోకి వచ్చింది.
చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారంలో ఉన్న కథ ప్రకారం... ముంబై కమిషనర్ ఆదిత్య అరుణాచలం ఓ కేసు విషయంలో దర్యాప్తు చేస్తున్న సమయంలో, అనుకోకుండా ఒక పెద్ద స్కామ్ కి సంబంధించిన సమాచారం లభిస్తుంది., దాన్ని పట్టుకుని లోతుగా వెళితే, తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ స్కామ్ లో ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులతో పాటు, పోలీస్ వారు కూడా ఉన్నారని తెలుస్తుంది.
ఆ క్రమంలో రజనీకు విలన్ కి డైరెక్ట్ గా జరిగిన డిస్కషన్, ఛాలెంజ్ దగ్గర ఇంటర్వెల్ పడితుంది. ఆ తర్వాత కథలో ఒక అనుకోని ట్విస్ట్ బయటకు వస్తుంది. ఇంతకు రజనీ నిజంగా హీరోనా.? లేక దొంగా.? అనే విషయం వైపు కథ మలుపు తిరుగుతుంది. అతను దొంగ అయితే మారువేషంలో పోలీస్ డిపార్ట్ మెంట్ లోకి ఎలా రాగలిగాడు.?
సెకండాఫ్ లో హీరో కి ఫ్లాష్ బ్యాక్ అందులో హీరోయిన్ మరియు విలన్ కి సంబంధించిన ఇంట్రడక్షన్,అక్కడే మొదట హీరోకి, విలన్ కి పోరాటం మొదలు. అక్కడ నుంచి ఇద్దరి మధ్యా వార్.. క్లైమాక్స్ కి రజనీ... విలన్ పై గెలుస్తాడు. అయినా అతన్ని సొసైటీ విలన్ అని అనే పరిస్థితి ఉంటుంది. దాంతో అతను ద బ్యాడ్ పర్సన్ గా మిగిలిపోతాడా .? ఇది బేసిక్ స్టోరీ ఇదే అని తెలుస్తోంది.
ఈ చిత్రం సెకండ్ హాఫ్ లో వచ్చే ఇన్వెస్టిగేటివ్ ఎపిసోడ్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ కు ముందు ఒక 15 నిమిషాల ఎపిసోడ్స్ అదిరిపోయాయని అంటున్నారు. అలాగే విలన్ సునీల్ శెట్టి, హీరో రజినీ మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించడం పక్కా అని సమాచారం.
ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో... నయనతార హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్తో పాటు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వీ ప్రసాద్ విడుదల చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం విడుదల కాబోతోంది. రజనీ కుమార్తెగా నివేదా థామస్.. ఇతర కీలక పాత్రల్లో తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు నటించారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.