లేట్ అయినా భారీగానే.. సాహో శాటిలైట్ రైట్స్ రికార్డ్
ఎట్టకేలకు ప్రభాస్ సాహో సినిమా శాటిలైట్ హక్కులు అమ్ముడయ్యాయి. అన్నిభాషల్లో కలిపి ఈ సినిమా శాటిలైట్ హక్కులు 20 కోట్ల ధర పలికినట్టుగా తెలుస్తోంది. ఈ లాక్ డౌన్ సమయంలోనే సాహో టీవీల్లో ప్రసారం కానుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా సాహో. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. బాహుబలి తరువాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అందుకు తగ్గట్టుగా అంతర్జాతీయ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్తో భారీగా ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ సినిమా రిలీజ్ తరువాత ఆ స్థాయి చూపించలేకపోయింది.
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు రిలీజ్కు ముందే బిజినెస్ పూర్తయిపోతుంది. థియేట్రికల్ బిజినెస్తో పాటు శాటిలైట్, డిజిటల్ రైట్స్ కూడా రిలీజ్కు ముందే అమ్ముడవుతాయి. కానీ సాహో విషయంలో అలా జరగలేదు. బాహుబలి క్రేజ్ ఉండటం, సాహో మీద కూడా భారీ అంచనాలు ఉండటంతో శాటిలైట్ రైట్స్కు భారీగా డిమాండ్ చేశారు చిత్రయూనిట్.
దీంతో అంత మొత్తం పుట్టి కొనేందుకు ఎవరు ముందుకు రాలేదు. దీంతో బిజినెస్ పూర్తి కాకుండానే సినిమాను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
అయితే సినిమా రిలీజ్ అయిన తరువాత రిజల్డ్ తేడా కొట్టేయటంతో శాటిలైట్ రైట్స్ తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అలా అలా ఆలస్యమైపోయింది. అయితే ఫైనల్ గా ఇన్నాళ్లు సాహో శాటిలైట్ రైట్స్ అమ్ముడయ్యాయి.
ఈ సినిమా తెలుగు వర్షన్ హక్కులు 12 కోట్లకు మిగిలిన భాషల హక్కలు అన్ని కలిపి 8 కోట్లకు అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఆలస్యంగా అయిన సాహో శాటిలైట్ ద్వారా 20 కోట్ల మేర వసూళు చేయటం విశేషం.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో ఈ సమయంలో టెలికాస్ట్ చేస్తే మంచి వ్యూయర్షిప్ వస్తుందని భావిస్తున్నారట. అందుకే భారీ మొత్తానికి హక్కులు సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఇక సినిమా విషయానికి వస్తే ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, నీల్ నితిన్ ముఖేస్లు కీలక పాత్రల్లో నటించారు. సౌత్ నుంచి లాల్, మురళీ శర్మ లాంటి వారు నటించారు.
ఈ సినిమాను ప్రభాస్ హోం బ్యానర్ యూవీ క్రియేషన్స్ సంస్థ దాదాపు 350 కోట్లతో రూపొందించింది. రన్ రాజ్ రన్ ఫేం సుజిత్ ఈ సినిమాకు దర్శకుడు.
భారీగా రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో నిరాశపరిచినా హిందీలో మాత్రం సూపర్ హిట్ అయ్యింది. దీంతో ప్రభాస్ ఇమేజ్ పాన్ ఇండియా స్టార్గా స్థిరపడిపోయింది.
ఈ సినిమా తరువాత జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.