- Home
- Entertainment
- Entertainment News
- Prabhas: ‘Mr.పర్పెక్ట్’కథ కాపీ కేసు, దిల్రాజు కి సుప్రీంకోర్టు హెచ్చరిక
Prabhas: ‘Mr.పర్పెక్ట్’కథ కాపీ కేసు, దిల్రాజు కి సుప్రీంకోర్టు హెచ్చరిక
Prabhas: మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కథ కాపీ వివాదంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రచయిత్రి శ్యామలా దేవి నవల కాపీ ఆరోపణలపై దిల్రాజు లాయిర్ కి సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేసింది.

Mister Perfect movie
Prabhas: 2011లో విడదులైన ‘Mr. పర్పెక్ట్’ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచింది. ప్రభాస్, కాజల్, తాప్సీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సీనియర్ దర్శకుడు దశరథ్ దర్శకత్వం వహించారు.
అయితే ఈ చిత్ర కథ ‘నా మనసు కోరింది నిన్నే’ అనే తన నవల నుండి కాపీ కొట్టారంటూ.. ప్రముఖ రచయిత్రి శ్యామలా దేవి కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసులో ట్రయల్కోర్టులో జరుగుతున్న విచారణ ప్రక్రియపై సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే విధించింది.
అయితే ఈ సమస్య పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలని, లేదంటే ఇబ్బందుల్లో పడతారని సోమవారం దిల్రాజు తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డిని సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది.
తాను రాసిన ‘నా మనసు కోరింది నిన్నే’ నవల ఆధారంగా మోసపూరితంగా సినిమా తీసి తన హక్కులకు భంగం కలిగించినవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముమ్మిడి శ్యామలారాణి అనే రచయిత నమోదుచేసిన కాపీరైట్ చట్టం కింద తమపై నమోదుచేసిన కేసుకు కాలపరిమితి ముగిసినందున దాన్ని కొట్టేయాలని కోరుతూ నిర్మాత దిల్రాజు, దర్శకుడు కొండపల్లి దశరథ్లు దాఖలుచేసిన పిటిషన్లపై సోమవారం జస్టిస్ జేబీపార్దీవాలా, జస్టిస్ మహాదేవన్లతోకూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఇందులో తొలుత దిల్రాజు తరుఫున కృష్ణదేవ్ అనే న్యాయవాది వాదనలు వినిపిస్తూ కేసును ఇదివరకే హైకోర్టు కొట్టేసిందని, సీఆర్పీసీ సెక్షన్ 468 కింద ఉన్న కాలపరిమితిని దృష్టిలో ఉంచుకొని కాపీరైట్యాక్ట్ సెక్షన్ 63 కింద నమోదైన కేసునూ కొట్టేయాలని కోర్టుకు విన్నవించారు.
మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా 2011 ఏప్రిల్ 20న విడుదలైతే ఆ సినిమా తన నవల ఆధారంగా తీశారంటూ రచయిత 2017 జులై 12న సీఆర్పీసీ సెక్షన్ 200 కింద కేసు నమోదుచేశారని పేర్కొన్నారు. ఈ సినిమా నిరంతరం టీవీల్లో ప్రసారమవుతోంది కాబట్టి ప్రాథమికంగా ఇది నిరంతరంగాసాగే నేరం (కంటిన్యూయెస్ అఫెన్స్)గానే కనిపిస్తోంది కాబట్టి ఆ అంశాన్ని తాము పరిశీలించాలనుకుంటున్నట్లు స్పష్టంచేశారు.
అందుకే ఈ కేసులో ప్రతివాదికి నోటీసులు జారీచేస్తూ రెండువారాల్లోపు సమాధానం చెప్పాలని ఆదేశించించారు. ఈ మధ్యకాలంలో ట్రయల్కోర్టులో ఉన్న ప్రొసీడింగ్స్పై స్టే విధిస్తున్నట్లు చెప్పారు. చివరలో ధర్మాసనం ముందుకు వచ్చిన దిల్రాజు తరుఫు సీనియర్ న్యాయవాది నిరంజ్రెడ్డికి ‘‘సమస్య పరిష్కారానికి ప్రయత్నించండి. లేదంటే మీరు ఇబ్బందుల్లో పడతారు’’అంటూ జస్టిస్ పార్దీవాలా సూచించారు.