మేనల్లుడి కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ (ఫోటోస్)
మెగా హీరో సాయిధరమ్ తేజ్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. చిత్రలహరి, ప్రతిరోజు పండగే లాంటి రెండు వరుస హిట్లు అందుకున్న తేజు ఈ ఏడాది మరో రెండు చిత్రాలతో రాబోతున్నాడు. తేజు నటించబోయే కొత్త చిత్రం నేడే లాంచ్ అయింది.
సాయిధరమ్ తేజ్ 14వ చిత్ర లాంచింగ్ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ అతిథులుగా హాజరయ్యారు.
ప్రస్థానం లాంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాన్ని తెరకెక్కించిన దేవ కట్టా ఈ చిత్రాన్ని దర్శకుడు.
భగవాన్, పుల్లారావు ల నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.
క్రేజీ బ్యూటీ నివేత పేతురాజ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
చిత్రలహరి తర్వాత వీరిద్దరూ రెండవసారి నటించబోతున్నారు.
చిత్రలహరి తర్వాత వీరిద్దరూ రెండవసారి నటించబోతున్నారు.
మేనల్లుడి సినిమా లాంచింగ్ కు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తేజు, నివేతపై తొలి క్లాప్ ఇచ్చారు.
దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు.
సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
దేవకట్టా దర్శత్వంలో నేడు ప్రారంభమైన చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ చిత్రానికి సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ మ్యూజిక్ అందించనున్నారు.