ఎన్టీఆర్ గారు స్వర్గం నుంచి దీవించండి.. ఆ రాక్షసుడితో పోరాడాలి.. పూనమ్ కౌర్ సంచలనం
అసలు విషయాన్నీ సూటిగా చెప్పకుండా నర్మగర్భ వ్యాఖ్యలతో కన్ఫ్యూజ్ చేసే సెలెబ్రిటీలు కొందరు ఉన్నారు. వారిలో హీరోయిన్ పూనమ్ కౌర్ ఒకరు. పూనమ్ కౌర్ తెలుగులో పలు చిత్రాల్లో నటించింది.
అసలు విషయాన్నీ సూటిగా చెప్పకుండా నర్మగర్భ వ్యాఖ్యలతో కన్ఫ్యూజ్ చేసే సెలెబ్రిటీలు కొందరు ఉన్నారు. వారిలో హీరోయిన్ పూనమ్ కౌర్ ఒకరు. పూనమ్ కౌర్ తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. హీరోయిన్ కొన్ని సినిమాలు మాత్రమే చేసింది. మిగిలిన చిత్రాల్లో ఆమెకు సెకండ్ హీరోయిన్ పాత్రలు, క్యారెక్టర్ రోల్స్ మాత్రమే దక్కాయి.
గత ఏడాది కాలంగా పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ఎవరినో నిందించే విధంగా పరోక్షంగా పూనమ్ కౌర్ చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. గతంలో ఆమెపై ట్రోలింగ్ జరగడం.. స్టార్ హీరోతో కలిపి ఆమెపై పుకార్లు సృష్టించడంతో పూనమ్ కౌర్ పోలీస్ ఫిర్యాదు కూడా చేసింది.
గురువారం రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ ని సందర్శించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన తర్వాత పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి.
'ఎన్టీఆర్.. ప్రజలకు ఆరాధ్య దైవం.. స్వర్గం నుంచి నన్ను దీవించండి.. రాక్షసులతో పోరాటం చేసేలా దీవించండి. మానవత్వం లోపించిన ఇలాంటి తరుణంలో మీలాంటి నాయకుడు , నటుడు ఈ సమాజానికి అవసరం' అంటూ పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇంతకీ పూనమ్ కౌర్ పోరాటం చేస్తానంటోంది ఏ రాక్షసుడిపై అనేది కొత్తగా పుట్టుకొచ్చిన డౌట్. తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం పూనమ్ కౌర్ త్వరలో తీర్థం పుచ్చుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా పూనమ్ కౌర్ ఓ స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ పై గత కొంతకాలంగా నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. విషయం క్లియర్ గా చెప్పకుండా పూనమ్ ఇలా ట్వీట్స్ తో దాగుడు మూతలు ఆడుతూ నెటిజన్లని కన్ఫ్యూజ్ చేస్తోంది.