పవన్ పై ఇంత పగా.. గుండు కామెంట్స్ చేసిన రోజా, లైక్ కొట్టిన పూనమ్ కౌర్
టాలీవుడ్ లో పూనమ్ కౌర్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న నర్మగర్భ వ్యాఖ్యలు అటు టాలీవుడ్ లో, ఇటు రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
టాలీవుడ్ లో పూనమ్ కౌర్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న నర్మగర్భ వ్యాఖ్యలు అటు టాలీవుడ్ లో, ఇటు రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
చాలా మంది నెటిజన్లు పూనమ్ కౌర్ పరోక్షంగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లని టార్గెట్ చేస్తోందని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు పూనమ్ కౌర్ బయట పడింది. గత కొంతకాలంగా పూనమ్ కౌర్ నర్మగర్భంగా చేస్తున్న ట్వీట్స్ పవన్ ని ఉద్దేశించినవే అని తెలిసిపోయింది.
ఈ విషయాన్ని పూనమ్ కౌరే అంగీకరించినట్లు అయింది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. గతంలో వైసిపి ఎమ్యెల్యే రోజా పవన్ పై రాజకీయ విమర్శలు చేస్తూ.. గతంలో పవన్ కళ్యాణ్ కి టిడిపి వాళ్ళు గుండు కొట్టించింది నిజం.. మళ్ళీ 2014 లో కొట్టించారు.. 2019లో కూడా కొట్టిస్తారు అని ఎన్నికలని ఉద్దేశించి రోజా వ్యాఖ్యలు చేసింది.
ఆ వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తాజాగా పూనమ్ కౌర్ ట్విట్టర్ వేదికగా రోజా పవన్ పై చేసిన గుండు కామెంట్స్ కు లైక్ కొట్టింది. ఇది ప్రస్తుతం అటు టాలీవుడ్, ఏపీ పాలిటిక్స్ లో సంచలనంగా మారింది. పూనమ్ కౌర్ ని గమనిస్తుంటే.. పవన్ పై ఆమెకు తీవ్రస్థాయిలో ఆగ్రహం ఉన్నట్లు అర్థం అవుతోంది.
పవన్ పై అంత పగ ఎందుకో ఆ కారణాన్ని పూనమ్ కౌర్ బయట పెట్టే వరకు ఎవరికీ తెలియదు. ఇటీవల పూనమ్ కౌర్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కు నివాళులు అర్పించింది. రాక్షసులతో పోరాటం చేసేలా తనని దీవించమని ఎన్టీఆర్ ని వేడుకున్న సంగతి తెలిసిందే.
గతంలో జల్సా చిత్రం పేరుతో పూనమ్ కౌర్ పవన్, త్రివిక్రమ్ పై పలు వ్యాఖ్యలు పరోక్షంగా చేసింది. గతంలో పవన్ పై తనకు క్రష్ ఉందని చెప్పిన పూనమ్ కౌర్ ఇప్పుడిలా టార్గెట్ చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో మరి..