- Home
- Entertainment
- Entertainment News
- విజయ్ సరసన నటించేందుకు పూజా హెగ్ధే భారీగా డిమాండ్.. తన రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే?
విజయ్ సరసన నటించేందుకు పూజా హెగ్ధే భారీగా డిమాండ్.. తన రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) తాజా రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోవాల్సిందే. విజయ్ దేవరకొండ, పూరీ కాంబినేషన్ లో వస్తున్నచిత్రం ‘జన గన మన’లో నటించేందుకు భారీగానే డిమాండ్ చేసిందంట.

గ్లామర్ బ్యూటీ పూజా హెగ్దే వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ బ్యూటీ నటించిన చిత్రాలు ఆశించినంత ఫలితాలు ఇవ్వకపోయినా.. పూజా డిమాండ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.
తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ కేరీర్ లో దూసుకుపోతోంది పూజా. 2020 నుంచి స్టార్ హీరోల సరసన నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘అల వైకుంట పురంలో’ ఇచ్చిన సక్సెస్ తో ఈ బ్యూటీ డిమాండ్ మరింత పెరిగింది.
పూజా నటించిన దాదాపు ఐదు చిత్రాలు ఆరు నెలల్లోనే రిలీజ్ అయ్యి థియేటర్లలో సందడి చేశాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య, ఎఫ్3 వంటి చిత్రాల్లో పూజాహెగ్దే నటించడం విశేషం. అయితే ఈ చిత్రాలు పూజాకు ఆశించినంతగా ఫలితాలివ్వకపోయినా పూజా డిమాండ్ మాత్రం తగ్గడం లేదు.
తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సరసన ‘జన గణ మన’ (JGM)లో హీరోయిన్ గా ఎంపికైంది. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలె ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా పూజా కూడా సెట్ కు హాజరైంది.
అయితే ఈ సినిమాలన్నింటికీ పూజా భారీగా డిమాండ్ చేసిందంట. ‘మహర్షి’ నుంచే తన రెమ్యూనరేషన్ లో ఎలాంటి తగ్గింపులకు ఇష్టపడటం లేదని టాక్. అప్పటి నుంచే ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల వరకు ఛార్జ్ చేసిందని టాక్. తాజాగా విజయ్ సినిమాలో నటించేందుకు కూడా భారీగానే డిమాండ్ చేసిందని తెలుస్తోంది.
పూరీ జగన్నాథ్, విజయ్ కాంబినేషన్ లో వస్తున్న మరో పాన్ ఇండియన్ మూవీ ‘జేజీఎం’లో నటించేందుకు పూజా ఏకంగా రూ.4 కోట్లు వసూళ్లు చేస్తుందట. ఒకేసారి కోటీ పెంచి దర్శకనిర్మాతలకు షాక్ ఇచ్చిందంట. అయినా పూజా హెగ్దేకు ఉన్న క్రేజ్ తో సినిమాలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం మంచి సక్సెస్ ను చూడగలిగితే పూజా మరింత డిమాండ్ చేసే అవకాశం లేకపోలేదు.