పవన్ స్పీడు...ఆ హీరోలలో టెన్షన్, నెగిటివ్ కామెంట్స్
వరుస పెట్టి కొత్త సినిమాల్ని ప్రకటిస్తూ ఫ్యాన్స్ లో జోష్ ని పెంచుతున్నారు పవన్ కళ్యాణ్. నిన్న , మొన్నటిదాకా పూర్తి సమయం ప్రజా జీవితానికే అని చెప్పుకుంటూ వచ్చిన ఆయన ఉన్నట్టుండి రెండు చిత్రాల్ని ప్రకటించడం, వాటిని పట్టాలెక్కించడం ఇండస్ట్రీకే కాక పార్టీ జనాలకు సైతం షాక్ కు గురిచేసింది.
అయితే అదే సమయంలో పవన్ రీఎంట్రీ చాలా మంది స్టార్ హీరోలకు మింగుడు పడటం లేదనేది ఫిల్మ్ నగర్ లో వినపడుతున్న వార్త. పవన్ వరస పెట్టి సినిమాలు చేస్తే తమ సినిమాలకు పోటీ ఖచ్చితంగా వస్తుందని స్టార్ హీరోలు బెంబేలెత్తుతున్నారట.
ఫలానా హీరో అని కాదు అనటం లేదు కానీ ఫామ్ లో ఉన్న హీరోలు ఈ విషయమై తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారట. పవన్ సినిమాలు చేయకపోవటంతో ఆయన అభిమానులు వేరే హీరో ల సినిమాలను భుజాన ఎత్తుకుంటున్నారు.
పవన్ పోటీకు వస్తే తాము మళ్లీ భాక్సాఫీస్ వద్ద ఆ స్దాయి భాక్సాఫీస్ రికార్డ్ లను క్రియేట్ చేయగలమా అనేది వారి సందేహంట. పవన్ సీన్ లో ఉన్నంతకాలం తమ సినిమాలు ఓ స్దాయి వద్దే ఆగిపోయాయని, ఇప్పుడు పుంజుకుంటున్న టైమ్ లో ఇది పెద్ద దెబ్బే అని భావిస్తున్నారట.
అలాగే పవన్ తో చేయటానికి స్టార్ డైరక్టర్స్ అటు వైపు మ్రొగ్గు చూపెడుతారు. ఆయన కోసం కథలు వండుకుని రెడీ అవుతారు. తాము నో చెప్పినా పెద్ద ఆల్టర్ట్నేటివ్ ఉంటుంది. ఇది కూడా డైరక్టర్స్ పరంగా తమకు సమస్యే. పవన్ తో సినిమా చేయటానికి సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తారు కానీ తమ దగ్గరకు వచ్చేసరికి అలా ఉండరని అనుకుంటున్నారట.
ఇక పవన్ ఇలా ఏడాదికి మూడు సినిమాలు చొప్పున ఒప్పుకుంటే తమ సినిమాల రిలీజ్ లకు పెద్ద పండుగలు,సీజన్ కూడా దొరకదని భావిస్తున్నారట.
మరో ప్రక్క పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రీ ఎంట్రీ అంటూ సంబరాలు చేసుకున్నారు. అది మిగతా హీరోల అభిమానులకు కారం రాసినట్లు అవుతోంది. దాంతో వారు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
యాంటి ఫ్యాన్స్ బాధను మరింతగా పెంచుతూ, మరో సర్ప్రైజ్నిచ్చారు పవన్. గబ్బర్సింగ్ కాంబోని సెట్ చేసేశాడు. అయితే ఆయన జోరు ఇంతటితో ఆగదట. ఇంకా రెండు సినిమాలు లైన్లో ఉన్నాయని పక్కా సమాచారం.
ఇప్పుడు ఒప్పుకున్న మూడు సినిమాల తర్వాత డాలీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారట పవన్. ఈ మేరకు డాలీతో కథా చర్చలు కూడా జరుగుతున్నాయట. ఓ పెద్ద నిర్మాత ఈ కాంబోని సెట్ చేస్తున్నారని వార్త.
డాలీ తో చేసిన తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమా పట్టాలెక్కబోతోందట. మొత్తంగా పవన్కళ్యాణ్ ఐదు సినిమాల్ని ఖాయం చేసినట్టైంది.
ఇక ఇవన్నీ పట్టించుకోని పవన్ మాత్రం ఫిబ్రవరి నుంచి సెట్లోకి అడుగు పెట్టబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి సర్ప్రైజ్గా ఈ రోజే ఈ చిత్రంలోని తొలి పాటని విడుదల చేయబోతున్నారని సమాచారం.
పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ తో బిజీగా ఉన్నప్పటికీ… ఆయన చేయబోతున్న `పింక్` రీమేక్ కోసం ఎప్పట్నుంచో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్రాజు ప్రత్యేకంగా ఈ సినిమాపై దృష్టిపెట్టి పనుల్ని చేయిస్తున్నారు. అందులో భాగంగానే పాటల్ని కూడా సిద్ధం చేయించినట్టు తెలుస్తోంది.
వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా సాగబోతోందట. హీరోయిన్స్ అంజలి, నివేదా థామస్, అనన్యతోపాటు మరో ఇద్దరు పేర్లు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్టు ప్రచారంలో ఉన్నాయి.